Renu Desai: థర్డ్ వేవ్ ను సీరియస్ గా తీసుకోండి : రేణు దేశాయ్

  • January 11, 2022 / 02:08 PM IST

గతంతో పోలిస్తే.. కరోనా మరింతగా విజృంభిస్తుంది. మరీ ముఖ్యంగా ఇది థర్డ్ అనే కంటే… సెలబ్రిటీ వేవ్ అంటే బాగుంటుందేమో..! ఎందుకంటే వరుసగా రోజుకో సెలబ్రిటీ కరోనా భారిన పడుతున్నారు.ఇప్పటికే మహేష్ బాబు, రాజేంద్రప్రసాద్, మంచు లక్ష్మి,సత్య రాజ్, మంచు మనోజ్, త్రిష, రాజేంద్రప్రసాద్, ఇషా చావ్లా వంటి వారు కరోనా బారిన పడ్డారు. తాజాగా పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్..అతని తల్లి సినీ నటి రేణు దేశాయ్ కూడా కరోనా బారీన పడ్డారు.

స్వయంగా రేణు దేశాయ్ ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. “మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా బారిన పడ్డాం.నాతో పాటు అఖీరా కూడా..! కొద్ది రోజులుగా కరోనా లక్షణాలు కనిపించడంతో.. కోవిడ్ టెస్ట్ చేయించుకోగా రిజల్ట్ లో పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం మేము బాగానే ఉంటున్నాం.నేను ఇప్పటికే వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్నాను. అయినా సరే కరోనా మమ్మల్ని విడిచిపెట్టలేదు. ఇక అకీరాకు వ్యాక్సిన్ వేయిద్దాం అనుకున్న టైములో కరోనా అటాక్ చేసింది.

దయచేసి అందరూ.. థర్డ్ వేవ్ ను సీరియస్ గా తీసుకోండి.మాస్కులు ధరించండి.అన్ని జాగ్రత్తలు తీసుకోండి..” అంటూ రేణు దేశాయ్ పేర్కొంది. ఈ పోస్ట్ ను చూసిన ఆమె ఫాలోవర్లు.. అఖీరా, రేణు దేశాయ్ త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నట్టు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు అయితే జూనియర్ పవర్ స్టార్ కి ఏమీ కాదు కంగారు పడకండి అంటూ ఈ పోస్ట్ ను వైరల్ చేస్తున్నారు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus