ఈసారి వెబ్ సైట్ పై మండిపడ్డ రేణు దేశాయ్..!

  • June 17, 2019 / 12:27 PM IST

సీనియర్ హీరోయిన్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇప్పటి వరకూ ఆమెను విసిగించిన పవన్ అభిమానుల పైన అలాగే కొందరు నెటిజెన్ల పైన మండి పడిన సందర్భాన్ని మనం చూస్తూనే వచ్చాము. అయితే తాజాగా ఆమె… ఓ మీడియా వ్యవహారశైలి పై తీవ్రంగా మండిపడింది. ఈ విషయం సొషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. రేణు కి మద్దతుగా ఆ మీడియా పై కొందరు నెటిజన్లు మండిపడుతూ కామెంట్లు పెడుతున్నారు.

అసలు విషయం ఏమిటంటే… రేణు ఇటీవల తన ఇద్దరు పిల్లలతో కలిసి శ్రీనగర్, జమ్మూ వంటి పలు ప్రాంతాల్లో పర్యటించింది. ఈ వార్తను ఓ వైబ్ సైట్ కవర్ చేసింది. రేణు తన పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలను… ఆ వెబ్ సైట్ కు సంబందించిన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ… ‘పవన్ కల్యాణ్ పిల్లలతో ఆయన మాజీ భార్య రేణుదేశాయ్’ అంటూ టైటిల్ పెట్టాడు. సరిగ్గా ఇక్కడే రేణు కి చాలా కోపం వచ్చినట్టుంది. ఆ పిల్లలకి తల్లి రేణు అన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఆ వెబ్ సైట్ తో ఇలా పోస్ట్ చేయడం పై రేణు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఇప్పుడే ఎవరో నాకు ఇది పంపించారు. ఈ ఆర్టికల్ రాసిన వ్యక్తి ఓ తల్లికే పుట్టి ఉంటాడు. ఒక తల్లిని ఇలా బాధ పెట్టకూడదు ఎప్పుడూ…!’ అంటూ తన సోషల్ మీడియాలో తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus