మొత్తానికి రేణు దేశాయ్ రీ ఎంట్రీ పై క్లారిటీ వచ్చేసింది..!

  • July 13, 2019 / 12:22 PM IST

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మళ్ళీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వబోతుందని గతంలో ప్రచారం జరిగింది. అయితే ఈ విషయం పై ఆమె స్పందించకపోవడంతో.. ఆ ప్రచారంలో నిజం లేదని అంతా అనుకున్నారు. అయితే చిత్ర యూనిట్ ఆమెను సంప్రదించిన మాట వాస్తవమేనట. కానీ ఆమె ఒప్పుకుందా లేదా అనేది మాత్రం క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు ఆ విషయం పై క్లారిటీ వచ్చేసింది. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ అనుమానాలకు క్లారిటీ ఇచ్చేశాడు. ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే బయోపిక్ కు సాయి మాధవ్ బుర్రా మాటలు రాస్తున్నాడు.

తాజాగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో.. రేణు దేశాయ్ ను ఈ బయోపిక్ లో ఓ పాత్ర కోసం తీసుకున్నట్టు తెలిపాడు. త్వరలోనే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారని చెప్పుకొచ్చాడు. మొత్తానికి రేణు దేశాయ్ సినిమాల్లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వడం మాత్రం కన్ఫార్మ్ అయ్యింది. స్టువర్ట్ పురం గజదొంగ ‘టైగర్ నాగేశ్వర రావ్’ బయోపిక్ లో బెల్లకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నాడు. ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ ‘దొంగాట’ వంటి డీసెంట్ హిట్స్ అందుకున్న వంశీ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. మరి ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్న రేణు దేశాయ్ ఎంతవరకూ అలరిస్తుందో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus