పార్వతీ దేవిగా దర్శనమివ్వబోతున్న రేణు దేశాయ్..!

  • March 25, 2021 / 05:13 PM IST

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్.. ఎప్పుడూ ఏదో ఒక వార్తలో నిలుస్తూనే ఉంటుంది. ఈమె పవన్ కళ్యాణ్ తో విడిపోయి 10ఏళ్ళు కావస్తున్నా.. ఇంకా అతని అభిమానుల వల్ల ఇబ్బంది పడుతూనే ఉంది. రెండేళ్ళ క్రితం ఈమె మరో పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అయ్యింది. ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది కానీ.. ఎందుకో ఇంకా పెళ్లి చేసుకోలేదు. సోషల్ మీడియాలో మాత్రం ఈమె ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటూ వస్తోంది.

తరచూ తన పిల్లలు అకీరా,ఆధ్య ల ఫోటోలను షేర్ చేస్తూ వస్తోంది. వాటికి పవన్ అభిమానులు పెట్టే కామెంట్లకు కూడా ఈమె మండిపడుతూ ఉండడం మనం చూస్తూనే వస్తున్నాం. ఇదిలా ఉండగా.. రేణు ఇప్పుడు సీరియల్స్ లో కూడా నటిస్తూ ఉండడం విశేషం. ఇప్పటికే బుల్లితెర పై పలు షోలకు మెంటర్ గా వ్యవహరిస్తూ వచ్చింది రేణు దేశాయ్. అయితే ఇప్పుడు సీరియల్లో కూడా కనిపించబోతుందట. వివరాల్లోకి వెళితే.. ‘రాధమ్మ కూతురు’ అనే సీరియల్లో రేణు గెస్ట్ రోల్ ఇవ్వబోతుందట.

పార్వతీదేవిగా రేణు ఈ సీరియల్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సీరియల్ లో అక్షర, అరవింద్ చేసిన పూజలకు సంతోషించిన పార్వతీదేవి అలియాస్ రేణు దేశాయ్ దివి నుంచి భువికి దిగి వస్తుందట. రేణు పాత్ర కచ్చితంగా ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుందని తెలుస్తుంది. ఈ సన్నివేశానికి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి.

Most Recommended Video

ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!
ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లు ఒకప్పుడు స్టార్ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్లుగా చేసిన వాళ్ళే..!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus