ఎట్టకేలకు వెండితెరపై మెరవనున్న రేణు దేశాయ్!

  • June 25, 2020 / 02:39 PM IST

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కొన్నాళ్లుగా సినిమాలలోకి రీఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఆమె అనేక మంది దర్శకులకు ఈ విషయం తెలియజేయడంతో పాటు… ఎటువంటి పాత్ర నైనా చేయడానికి సిద్ధం అని అన్నారు. కొద్దిరోజుల క్రితం బద్రి మూవీ 20ఏళ్ళు పూర్తి చేసుకున్న సంధర్భంగా ఆ చిత్ర దర్శకుడు పూరి జగన్నాధ్ తో లైవ్ చాట్ చేసిన రేణు, తనకు సినిమా అవకాశం కావాలని కోరుకున్నారు. ఇక మహేష్ మూవీలో కూడా నటించాలని ఉందని ఆమె చెప్పడం జరిగింది.

ఐతే ఎట్టకేలకు ఆమెకు ఓ మంచి అవకాశం మహేష్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అడివి శేషు హీరోగా మేజర్ అనే ఓ బయోపిక్ తెరకెక్కుతుంది. ఈ మూవీని మహేష్ తన సొంత నిర్మాణ సంస్థ జి ఎమ్ బి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం రేణు దేశాయ్ ని తీసుకున్నారట. సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రేణు పాత్ర ఏమిటి అనేది ఇంకా తెలియదు.

ఐతే వెండితెరపై మళ్ళి కనిపించాలన్న కోరిక మాత్రం మహేష్ తీర్చినట్లు తెలుస్తుంది. 2000లో వచ్చిన బద్రి మూవీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్ ఆ సమయంలో పవన్ ప్రేమలో పడింది. అప్పటికే ఒప్పుకున్న ఓ తమిళ చిత్రంతో పాటు, జానీ మూవీలో నటించిన రేణు, తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పారు. ఆ తరువాత అనేక మంది సినిమా ఆఫర్స్ ఇచ్చినా, పవన్ కోసం ఆమె, సినిమాలు చేయలేదు.

Most Recommended Video

కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా రివ్యూ & రేటింగ్
పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో అత్యధిక నష్టాలు మిగిల్చిన పది చిత్రాలు ఇవే

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus