పవన్ కళ్యాణ్ అభిమానులకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన వర్మ
March 28, 2017 / 12:38 PM IST
|Follow Us
దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్కు మధ్య మాటల యుద్ధం పెరిగి పెద్దది అవుతోంది. తమ అభిమాన హీరోని కించపరిచినందుకుగాను వర్మపై వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. వర్మ చనిపోయినట్లు ఫోటోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పైగా “హఠాత్తుగా మరణించిన రాంగోపాల్ వర్మ.. సినీ పరిశ్రమకు పట్టిన పీడ తొలగిపోయిందని హర్షం వ్యక్తం చేస్తున్న పలువురు సినీ ప్రముఖులు.. ఆనంద భాష్పాలతో వీడ్కోలు చెప్తూ నివాళులు అర్పిస్తున్న సినీ ప్రపంచం” అంటూ అని ఓ ఫోటోను పోస్ట్ చేశారు. ఈ ఫోటో వర్మకు కూడా చేరింది. దీనిపై తన స్టైల్లో స్పందించారు. “ముందుగా ఈ ఫోటో పెట్టినందుకు పవన్ ఫ్యాన్స్కు థ్యాంక్స్” అంటూ వర్మ ట్వీట్ చేశారు.
అంతటితో ఆగలేదు.. “లవ్ యూ టూ మై డియర్ స్వీట్ డార్లింగ్ బ్యూటిఫుల్ క్యూట్ పీకే ఫ్యాన్స్” అని ఫోటోను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. “కొందరు గొర్రెల్లాంటి మూర్ఖులకు తాను మూడు జన్మల క్రితమే పుట్టానని.. ఇప్పుడు బ్రతికున్నది తన ఆత్మ అని తెలియడం లేదు. ఆత్మలకు చావు లేదని… ఎందుకంటే అవి ఎప్పటికీ చావులోనే బతుకుతాయి” అని వర్మ దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.