హీరోయిన్స్ పై లైగింక దాడి గురించి మాట్లాడిన రిచా గంగోపాధ్యాయ

  • March 15, 2017 / 01:52 PM IST

దక్షిణాది సినీ పరిశ్రమల్లోని హీరోయిన్స్  లైంగిక వేధింపులకు గురవుతున్నారు. కొంతమంది తమకు ఎదురైన అనుభవాన్ని ఎప్పటికప్పుడు బయట పెడుతుంటే, మరికొంతమంది నటీమణులు ఆలస్యంగా చెబుతున్నారు. తాజాగా ఈ విషయంపై రిచా గంగోపాధ్యాయ స్పందించింది. లీడర్ సినిమాతో  తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ భామ మిరపకాయ్, మిర్చి వంటి విజయాలను సొంతం చేసింది. నేటి తారలతో పోటీ పడలేక స్వస్థలం అమెరికాకు వెళ్ళిపోయిన ఈ బ్యూటీ సినీ పరిశ్రమలో జరుగుతున్న విషయాలను తెలుసుకుంటూనే ఉంది.

హీరోయిన్స్ పై లైంగిక వేధింపుల గురించి ఆమె మాట్లాడుతూ ” తెలుగు, తమిళ పరిశ్రమల్లో అందరూ చాలా ప్రొఫెషనల్ గా ఉంటారు. అంతేకాకుండా నేను చాలా సీరియస్ గా ఉండేదాన్ని. అందుకే నాకు ఎటువంటి చేదు అనుభవం ఎదురుకాలేదు” అని వివరించింది. “ఏ రంగంలో నైనా మహిళలపై లైంగిక వేధింపులు కామన్. ముందు మనం దైర్యంగా ఉండాలి. అప్పుడు ఎవరూ మన జోలికి రారు” అంటూ నూతన నటీమణులకు రిచా సలహా కూడా ఇచ్చింది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus