ఎన్టీఆర్ నుండీ ‘ఆర్.ఆర్.ఆర్’ లేటెస్ట్ అప్డేట్..!

  • March 29, 2019 / 04:05 PM IST

‘బాహుబలి’ తరువాత దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న భారీ చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. ఎన్టీఆర్, చరణ్ లు హీరోలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుని మరో షెడ్యూల్ కు రెడీ అయ్యింది. ఇందులో భాగంగా తారక్ గుజరాత్ లోని వడోదర నగరానికి వెళ్తున్నాడట.ఈ విషయాన్ని స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.


ఫ్లైట్ టికెట్ ను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ… ” ‘ఆర్.ఆర్.ఆర్’ భారీ షెడ్యూల్ కోసం బయలుదేరుతున్నా” అంటూ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో తారక్, రాంచరణ్, రాజమౌళి తదితరులు ఈ ఉదయం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండీ గుజరాత్ లోని వడోదరకు బయల్దేరారట. ఇక ట్విట్టర్లో ఈ పిక్ చూసిన ఎన్టీఆర్ అభిమానులు ‘హ్యాపీ జర్నీ అన్నా.. మాకు ఇలానే అప్డేట్స్ ఇస్తూ ఉండు’ అంటూ కామెంట్లు పెడుతుండడం విశేషం. ఇక ఈ షెడ్యూల్ లో హీరోయిన్లు అలియా, డైసీ లు కూడా జాయిన్ అవుతారట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus