న్యూమరాలజీని మరీ పిచ్చిగా నమ్ముతున్న సాయి తేజ్

  • June 24, 2019 / 07:08 PM IST

సుప్రీమ్ హీరో సాయి తేజ్ హీరోగా మారుతీ డైరెక్షన్ లో ఓ చిత్రం రాబోతుందని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఆ చిత్రం ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. మొదట ఈ చిత్రానికి ‘భోగి’ అనే టైటిల్ ను అనుకున్నప్పటికీ చివరికి ‘ప్రతిరోజూ పండగే’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. వచ్చే ఏడాది సంక్రాతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. ఈ సమ్మర్ కి ‘చిత్రలహరి’ చిత్రంతో డీసెంట్ హిట్టందుకున్నాడు తేజు. దానికోసం ఓ సెంటిమెంట్ ను కూడా ఫాలో అయ్యాడు.

సాయి ధరమ్ తేజ్ గా ఉన్న తన పేరుని సాయి తేజ్ గా మార్చుకున్నాడు. ‘ధరమ్’ అంటే దరిద్రమని న్యూమరాలజీ లెక్కల ప్రకారం.. తన పేరుని మార్చుకున్నాడట. అంతేనా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా సెంటిమెంట్ ప్రకారం ‘శిల్పకళా వేదిక’ లోనే జరగాలని ప్రొడ్యూసర్లని పట్టుపట్టి మరీ ‘జె.ఆర్.సి’ పంక్షన్ హాల్ నుండీ మార్పించుకున్నాడు. ఇప్పుడు ‘ప్రతిరోజూ పండగే’ చిత్రానికి కూడా సెంటిమెంట్లను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. సోషల్ మీడియా లో ఈ చిత్రం టైటిల్ హాష్ ట్యాగ్ ను ‘#PratiRojuPandaage’ లా వాడాడు. సాధారణంగా ‘#PratiRojuPandage’ అని వాడుతుంటారు. తేజు ఏదో పొరపాటున ఇలా టైపు చేసి ఉండొచ్చు అని అనుకుంటే.. ‘క్లాప్ బోర్డు’ పై కూడా అలానే ఉండటం చర్చనీయాంశం అయ్యింది. ‘గీత ఆర్ట్స్’ ‘యూవీ క్రియేషన్స్’ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇక పూర్తి నటీనటుల వివరాలు త్వరలో ప్రకటించబోతున్నారని సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus