విన్నర్ కోసం గుర్రమ్ ఎక్కిన సాయిధరమ్ తేజ్!

  • November 29, 2016 / 12:25 PM IST

మెగా ఫ్యామిలీ హీరోలకి ముందు నుంచి గుర్రాలంటే ఎందుకో విపరీతమైన ఇష్టం. అందుకే తమ ప్రతి సినిమాలో ఏదో ఒక్క సన్నివేశంలోనైనా గుర్రం ఉండేలా జాగ్రత్తలు తీసుకొంటుంటారు. చిరంజీవి మొదలెట్టిన ఈ ఆచారాన్ని ప్రస్తుతం వస్తున్న యంగ్ మెగా హీరోలవరకూ అందరూ ఫాలో అవుతూనే ఉన్నారు. “బ్రూస్ లీ”లో మెగాస్టార్ చిరంజీవి, “గబ్బర్ సింగ్”లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, “మగధీర, నాయక్”లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, “సరైనోడు”లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, “సుప్రీమ్”లో సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ ఇలా మెగా హీరోలందరూ ఆ ఆనవాయిటీని కొనసాగిస్తున్నారు.

ఇప్పుడు సాయిధరమ్ తేజ్ ఈ వ్యవహారాన్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్లి.. తన తాజా చిత్రం “విన్నర్”లో ఏకంగా ఓ గుర్రం చేజ్ సీన్ నే ప్లాన్ చేసేశాడట, అది కూడా ఉక్రెయిన్ లో. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్-రకుల్ ప్రీత్ జంటగా రూపొందుతున్న “విన్నర్” చిత్రంలో సాయిధరమ్ తేజ్ ఉక్రెయిన్ రహదారులు, బ్రిడ్జ్ లపై గుర్రపు స్వారీ చేసే సన్నివేశాలను తెరకెక్కించారట. ఈ సన్నివేశం మెగాభిమానులకు విపరీతంగా నచ్చుతుందని చిత్ర బృందం చెబుతోంది. నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2017 సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు!

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus