మెగాహీరో.. బ్యాక్ టూ బ్యాక్ మూవీస్

  • January 28, 2021 / 07:40 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో రానున్న రోజుల్లో మంచి మంచి సినిమాలు రాబోతున్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా మెగా హీరోలకు సంబంధించిన సినిమాలు ఎక్కువగానే రాబోతున్నాయి. ముఖ్యంగా మెగా హీరోల నుంచి సినిమాలు గట్టిగానే రాబోతున్నాయి. ఇక 2021లో పవన్ కళ్యాణ్ తో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా వరుసగా రెండు సినిమాలను తీసుకురాబోతున్నాడు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఏప్రిల్ 19న విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే.

ఇక అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు టాక్ వస్తోంది. ఇక అదే తరహాలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నుంచి కూడా ఈ ఏడాది రెండు సినిమాలు రాబోతున్నాయి. దేవకట్టా దర్శకత్వంలో చేస్తున్న రిపబ్లిక్ సినిమా ఏప్రిల్ 30న విడుదల చేయాలని చూస్తున్నారు. ఇక సుకుమార్ ప్రొడక్షన్ లో కూడా బ్లాక్ మ్యాజిక్ బ్యాక్ డ్రాప్ లో 15వ సినిమా చేస్తున్న సాయి ధరమ్ తేజ్ ఆ మూవీని ఇదే ఏడాది డిసెంబర్ లో విడుదల చేయాలని అనుకుంటున్నాడు.

ఈ విధంగా మెహ హీరోలు ఇద్దరు కూడా డబుల్ ధమాకా ఇవ్వబోతున్నట్లు అర్ధమవుతోంది. సాయి ధరమ్ తేజ్ వచ్చే ఎడాది కూడా వీలైనంత వరకు బ్యాక్ తో బ్యాక్ 2 మూవీస్ ను రిలీజ్ చేసే విధంగా కథలను ఎంచుకుంటున్నట్లు సమాచారం.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus