రవితేజ తో మల్టీ స్టారర్.. క్లారిటీ ఇచ్చిన తేజు..!

  • December 20, 2019 / 03:05 PM IST

అరడజను ప్లాపుల తర్వాత ఈ ఏడాది ‘చిత్రలహరి’ తో డీసెంట్ హిట్ కొట్టి మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు మెగా మేనల్లుడు సాయి తేజ్. అదే ఉత్సాహంతో ఇప్పుడు ‘ప్రతీరోజూ పండగే’ చిత్రం చేసాడు. ఈరోజు (డిసెంబర్ 20న) విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ పాజిటివ్ టాక్ వస్తుండడం విశేషం. ఇక ఈ చిత్రం గురించి ముందు నుండీ నిర్వహిస్తున్న ప్రమోషన్లలో హీరో తేజు చాలా కాన్ఫిడెంట్ గా.. హిట్ గ్యారంటీ అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇదిలా ఉండగా ప్రమోషన్లలో భాగంగా తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం కొత్త కుర్రాడు సుబ్బు డైరెక్షన్లో ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రాన్ని చేస్తున్నాడు తేజు. నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. 2020 సమ్మర్ కి ఈ చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. మాస్ మహా రాజ్ రవితేజతో ఓ సినిమా చేసే ఛాన్స్ ఉందని తేజు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని.. ఫైనల్ వెర్షన్ ఓకే అయితే కచ్చితంగా ఆ సర్ప్రైజ్ ఉంటుందని చెప్పుకొచ్చాడు.

రూలర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రతిరోజూ పండగే సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus