Sai Dharam Tej: సాయి తేజ్ కాదు ముందుగా ఆ హీరోకే కథ చెప్పాడట..!

  • September 30, 2021 / 04:07 PM IST

మెగా మేనల్లుడు సాయి తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రిపబ్లిక్’. దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘జె.బి.ఎంటర్టైన్మెంట్స్’ ‘జీ స్టూడియోస్’ బ్యానర్ల పై జె.భగవాన్, జె.పుల్లారావు లు కలిసి నిర్మించారు. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, జగపతి బాబు వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ పెద్దగా హైలెట్ అవ్వలేదు కానీ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ స్పీచ్ వల్ల ఈ సినిమా పై అందరి దృష్టి పడింది.

ఇదిలా ఉండగా.. దర్శకుడు దేవా కట్టాకి మంచి సినిమాలు తీస్తాడు అనే పేరు ఉంది కానీ అతనికి కమర్షియల్ హిట్లు లేవు. ఇక ‘రిపబ్లిక్’ నిర్మాతలైతే.. ఇప్పటివరకు వాళ్ళు హిట్టు మొహం చూసింది ఏమీ లేదు. కానీ సాయి తేజ్ నటించిన గత 3 సినిమాలు ‘చిత్రలహరి’ ‘ప్రతిరోజూ పండగే’ ‘సోలో బ్రతుకే సో బెటర్’ వంటి చిత్రాలు హిట్ అవ్వడంతో ‘రిపబ్లిక్’ కూడా హిట్ అవుతుందేమో అని కొంతమంది మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. నిజానికి ‘రిపబ్లిక్’ అనే కథలో చాలా బలం ఉందని నమ్మి మెగాస్టార్ చిరంజీవి..

సాయి తేజ్ తో చేయించారు. ఈ మూవీ విషయంలో మెగాస్టార్ రిఫరెన్స్ లు చాలానే ఉన్నాయనేది ఇన్సైడ్. అయితే ‘రిపబ్లిక్’ కథని మొదట సాయి తేజ్ కోసం అనుకోలేదట దర్శకుడు దేవా కట్టా. మొదట ఈ చిత్రం కథని నాగ చైతన్యకి వినిపించాడట. ‘ఆటో నగర్ సూర్య’ టైంలోనే నాగ చైతన్య ఈ కథ విన్నట్టు తెలుస్తుంది. ఆ టైములో అతను సానుకూలంగా స్పందించినప్పటికీ అటు తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉండడం.. అలాగే దేవా కట్టా కూడా వేరే సినిమాలతో బిజీ అయిపోవడంతో వీరి కాంబో రిపీట్ అవ్వలేదని తెలుస్తుంది.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus