పవన్ క్రేజ్ ని తెలుసుకున్నా : సాయి పల్లవి

  • July 26, 2017 / 07:12 AM IST

మలయాళం ‘ప్రేమమ్’ సినిమాతో మలార్ గా అందరి మనసులు గెలుచుకున్న సాయి పల్లవి ఫిదా మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయమయింది. తెలంగాణ అమ్మాయి భానుమతిగా అందరినీ మెప్పించింది. పవన్ కళ్యాణ్ అభిమానిగా ఆయన డైలాగ్స్  అదరగొట్టింది. ఈ విషయం పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో పల్లవి స్పందించింది. “ఫిదాని నేనూ థియేట‌ర్లో చూశా. ప‌వ‌న్ క‌ల్యాణ్ పేరు ఎత్త‌గానే.. థియేట‌ర్ అంతా మార్మోగిపోయేవి. మొదట్లో నా న‌ట‌న చూసి అరుస్తున్నార‌నుకొనేదాన్ని. అయితే అది ప‌వ‌న్ మానియా అని ఆ త‌ర‌వాతే అర్థ‌మైంది.” అని వివరించింది.

భాగమతి క్యారక్టర్ గురించి మాట్లాడుతూ ” ప్రేమ‌మ్ త‌ర‌వాత న‌న్నంతా మ‌ల్లార్‌.. మ‌ల్లార్ అని పిల‌వ‌డం మొద‌లెట్టారు. ఆ పాత్ర ప్ర‌భావం అంత‌టిది. మ‌ళ్లీ అలాంటి పాత్ర దొరుకుతుంద‌నుకోలేదు. శేఖ‌ర్ క‌మ్ముల ఈ క‌థ గురించి చెప్ప‌గానే.. క‌చ్చితంగా ప్రేమ‌మ్ స్థాయి సినిమా మ‌రోటి దొరికేసింద‌నిపించింది. నా వ‌ర‌కూ… ఈ పాత్ర‌కు ఏం చేయ‌గ‌ల‌నో అదే చేశా. అందుకే ఇంత మంచి పేరొచ్చింది.” అని వెల్లడించింది. ప్రస్తుతం సాయి పల్లవి నాని సరసన ఎంసీఏలో నటిస్తోంది. ఆ సినిమా తర్వాత డాక్ట‌ర్ చదవడం కొనసాగించనుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus