‘భారత్’ మూడు రోజుల కలెక్షన్స్..!

  • June 8, 2019 / 05:48 PM IST

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్షన్లో వచ్చిన తాజా చిత్రం ‘భారత్’. కత్రినా కైఫ్,దిశా పటాని హీరోయిన్లుగా నటించారు. విశాల్ శేఖర్ సంగీతమందించిన ఈ చిత్రాన్ని ‘రీల్ లైఫ్ ప్రొడక్షన్స్’ ‘సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్’ ‘టి సిరీస్’ సంస్థలు కలిసి 100 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించాయి. రంజాన్ కానుకగా ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుండే ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. కానీ సల్మాన్ స్టార్ డం, అలాగే పండుగ సీజన్ కావడంతో బాగా క్యాష్ చేసుకుంది. సల్మాన్ కెరీర్లోనే ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ ను రాబట్టి ట్రేడ్ కి సైతం షాకిచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా 4,700 థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు వసూళ్ళ విషయంలో ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ రికార్డును బ్రేక్ చేసింది. మొదటి రోజు 42.30 కోట్లను .. రెండో రోజున 31 కోట్లను .. మూడో రోజున 28 కోట్లను వసూలు చేసింది ఈ చిత్రం. ఇలా మొదటి మూడు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయి రికార్డు సృష్టించింది. ఇంతటి భారీ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు సల్మాన్ ఖాన్ తన ట్విట్టర్ థాంక్స్ చెప్పాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus