చిన్మయిని సమంత ఎందుకు ఏడిపించింది?

  • September 23, 2017 / 07:18 AM IST

సినిమాలో సమంత దేహం అయితే.. చిన్మయి ఆత్మ. అలా ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఏ మాయ చేసావే చిత్రం నుంచి.. ఇప్పటి వరకు గాయని చిన్మయి డబ్బింగ్ చెబుతూ వస్తోంది. ఆ క్యూట్ బ్యూటీ నటనకు చిన్మయి గొంతు బాగా సెట్ అయింది. అంతేకాదు అప్పటి నుంచి ఇప్పటి వరకు వీరిద్దరి మధ్య స్నేహం కొనసాగుతోంది. తాజాగా చిన్మయిని  సమంత  ఏడిపించింది. నిజంగానే .. ఏడిపించింది. అయితే తన మాటలతో కాదు.. నటనతో కన్నీరు పెట్టించింది. సమంత ఆత్మగా నటించిన చిత్రం రాజు గారి గది 2. ఓంకార్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నటించిన ఈ సినిమా ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

సమంత పాత్రకు డబ్బింగ్ చెబుతూ చిన్మయికి ఏడుపు వచ్చిందంట. ఈ విషయాన్నీ ఆమె నిన్న ట్విట్టర్ వేదికపై చెప్పింది. అంతలా సమంత నటించిందని అభినందించింది. ఆ నటనను మనం కూడా చూడాలంటే అక్టోబర్ 13  వరకు ఆగాల్సిందే. రాజు గారి గది సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus