సమీరాని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. కారణం అదే..!

  • July 5, 2019 / 06:12 PM IST

హీరోయిన్లు సాధారణంగా ప్రెగ్నెంట్స్ అయిన తరువాత బయటకి రావడానికి ఇష్టపడరు. కానీ బాలీవుడ్ హీరోయిన్లు మాత్రం నెలలు నిండిన తరువాత ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇది మన టాలీవుడ్ కు కూడా పాకిందనుకోండి అది వేరే విషయం. అప్పట్లో ప్రెగ్నెంట్ లేడీస్ ను ఎటువంటి పనులు చేయొద్దనే వారు.కానీ ఇప్పుడు మాత్రం కొంత వరకూ ఎక్సర్సైజులు చేయడం మంచిదని వైద్యులే చెబుతున్నారు. ఇదిలా ఉంJai Chiranjeevaటే… తాజాగా సమీరా రెడ్డి ని చూస్తుంటే కాస్త ఎక్కువగానే వర్కౌట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది.

గతంలో చిరంజీవి, ఎన్టీఆర్ లతో ‘నరసింహుడు’ ‘అశోక్’ ‘జై చిరంజీవ’ వంటి చిత్రాలలో హీరోయిన్ గా నటించింది సమీరా రెడ్డి.38 ఏళ్ళ స‌మీరారెడ్డి 2014లో ముంబైకు చెందిన బిజినెస్‌మేన్‌ని అశోక్ వ‌ర్దే ను వివాహం చేసుకుని.. 2015లో ఒక అబ్బాయికి జ‌న్మ‌నిచ్చింది. ఇప్పుడు రెండోసారి ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది. ఇప్పటివరకూ ఆమె నెలలు నిండిన గర్భంతో ఫోటోలు దిగుతూ వాటిని పోస్ట్ చేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు అదే గర్భంతో స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ చేస్తూ ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు సమీరాను తెగ ట్రోల్ చేస్తున్నారు.

2

3

4

5

6

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus