బాలీవుడ్ రిజెక్ట్ చేయడంతో మళ్ళీ టాలీవుడ్ రిటర్న్ అయ్యాడు

  • February 25, 2020 / 12:16 PM IST

ఒకే ఒక్క సినిమాలో టాలీవుడ్, బాలీవుడ్ లను ఊపేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. మనోడి ఫిలిమ్ మేకింగ్ కంటే యాటిట్యూడ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ గా మారింది. అటువంటి సెన్సేషనల్ సందీప్ రెడ్డికి ఇప్పుడు చేతిలో సినిమా లేకుండా అయిపోయింది. “కబీర్ సింగ్” అనంతరం బాలీవుడ్ లోనే తన తదుపరి సినిమా ఉంటుందని సందీప్ ప్రకటించడంతోపాటు.. “కబీర్ సింగ్” నిర్మాతలే తన రెండో బాలీవుడ్ ప్రొజెక్ట్ ను నిర్మిస్తారని కన్ఫర్మ్ చేశాడు.

అయితే.. ఇప్పుడు సదరు నిర్మాతలు సందీప్ రెడ్డితో సినిమా నిర్మించడానికి ఆసక్తి చూపకపోవడంతోపాటు.. సందీప్ కి బాలీవుడ్ లో మరో నిర్మాత దొరకకపోవడం గమనార్హం. దాంతో ఇప్పుడు మళ్ళీ తెలుగు సినిమావైపు చూస్తున్నాడు సందీప్. తెలుగులో మహేష్, ప్రభాస్ వంటి వారికి కథలు చెప్పినప్పటికీ.. ఆ ప్రొజెక్ట్స్ వర్కవుట్ అవ్వలేదు. దాంతో ఇప్పుడు హైద్రాబాద్ మకాం మార్చి ఇక్కడే ఏదో ఒక సినిమా త్వరగా పట్టాలెక్కించాలని ప్రయత్నిస్తున్నాడు.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus