స్టార్ హీరోతో సందీప్ రెడ్డి ప్లాన్!

  • December 21, 2020 / 05:50 PM IST

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నారు. ‘అర్జున్ రెడ్డి’ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఇదే సినిమాను బాలీవుడ్ లో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేశాడు. ఈ రీమేక్ కూడా సూపర్ సక్సెస్ అయింది. సందీప్ రెడ్డి నుండి ‘అర్జున్ రెడ్డ్’ సినిమా వచ్చి మూడేళ్లు అవుతుంది. కానీ ఇప్పటివరకు ఆయన నుండి కొత్త సినిమా రాలేదు. ‘కబీర్ సింగ్’ విడుదలైన తరువాత ఏడాదిన్నర పాటు తన కొత్త సినిమాను మొదలుపెట్టలేదు సందీప్.

హిందీలోనే తన మూడో సినిమా చేయాలనుకున్నాడు కానీ ఇప్పటివరకు అది పట్టాలెక్కలేదు. సందీప్ తన తదుపరి చిత్రాన్ని హిందీలోనే.. రణబీర్ కపూర్ హీరోగా తీయాలనుకున్నాడు. దాదాపు ఏడాదిగా ఈ ప్రాజెక్ట్ గురించి వార్తలొస్తున్నాయి. కానీ ఇప్పటివరకు సెట్స్ పైకి వెళ్లలేదు. దీంతో ఈ కాంబినేషన్ లో సినిమా ఉండదని అందరూ అనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం సందీప్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ రణబీర్ తోనే కలిసి చేయబోతున్నారట. ఈ సినిమాకి టైటిల్ కూడా ఫిక్స్ అయిందంటూ బాలీవుడ్ మీడియా వర్గాల్లో వార్తలొస్తున్నారు.

ఈ సినిమాకి ‘యానిమల్’ అనే టైటిల్ ని పెట్టాలని సందీప్ భావిస్తున్నాడట. తిట్లే బట్టి చూస్తుంటే ఈ సినిమాలో హీరోని నెగెటివ్ షేడ్స్ లో చూపిస్తాడేమోననే సందేహాలు కలుగుతున్నాయి. సాఫ్ట్ గా కనిపించే రణబీర్ ని తెరపై నెగెటివ్ షేడ్స్ లో చూపించడమంటే సందీప్ కి పెద్ద టాస్క్ అనే చెప్పాలి. మరేం చేస్తాడో చూడాలి. ప్రస్తుతం రణబీర్ ‘శంషేరా’, ‘బ్రహ్మాస్త్ర’ వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు. ‘శంషేరా’ షూటింగ్ పూర్తి కాగా.. ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్ దశలో ఉంది.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus