‘సరిలేరు’ టీం అలా చెప్పకుండా ఉండాల్సింది..!

  • February 3, 2020 / 03:04 PM IST

సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ కొట్టిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం ఇప్పటికీ డీసెంట్ రన్ కొనసాగిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం 133 కోట్ల పైనే షేర్ ను వసూల్ చేసింది. ఒక్క ఓవర్సీస్ లో మాత్రం ఈ చిత్రానికి 1.50 కోట్లు వరకూ నష్టం వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే అక్కడ ఫుల్ రన్ కంప్లీట్ అవ్వలేదు.. కానీ ఆశించిన స్థాయిలో అక్కడ కలెక్ట్ చేయడం లేదు. అయితే ఓవరాల్ గా ఇది మహేష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ చిత్రం అని చెప్పాలి.

అయితే ఈ చిత్రానికి ఇంకా.. వసూళ్ళు వచ్చే అవకాశం ఉండేదట. కానీ చిత్ర యూనిట్ సభ్యులు చేసిన ఒక్క తప్పు వల్ల అది సాధ్యం కాలేదని తెలుస్తుంది. విషయం ఏమిటంటే గత వారం ఈ చిత్రంలో కొత్త సీన్లు యాడ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే అవి ట్రైన్ కామెడీ సీన్లే అని చెప్పి చిత్ర యూనిట్ తప్పు చేసిందట. సినిమా మొదటి షో నుండీ ట్రైన్ కామెడీ చాలా ల్యాగ్ అని.. విసిగించిందని .. చాలా మంది కామెంట్స్ చేశారు. అలాంటప్పుడు మళ్ళీ ట్రైన్ సీన్లే యాడ్ చేస్తున్నాం అని చెప్పడంతో.. ప్రేక్షకులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు. నిజానికి కొత్తగా యాడ్ చేసిన సీన్లలో.. హీరోయిన్ రష్మిక.. తన తండ్రి రావు రమేష్ కు ఉరి వేసే సన్నివేశం చాలా బాగుందని కొందరు చెబుతున్నారు. ఇది పక్కన పెడితే చిత్ర యూనిట్ సభ్యులు కొత్త సీన్లు యాడ్ చేస్తున్నాం అని చెబితే సరిపోయేది.. దాని వల్ల మరికొంత ఎక్కువగా వసూళ్ళు వచ్చేవి. కానీ అవి ట్రైన్ కామెడీ సీన్లే అని చెప్పి తప్పు చేసారని మాత్రం ఫిలిం విశ్లేషకులు బలంగా చెబుతున్నారు.

అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన మీడియం రేంజ్ హీరోల సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus