Mahesh Babu: సర్కారు పాట షూట్ పూర్తయ్యేది అప్పుడేనా?

  • September 18, 2021 / 12:02 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలను వేగంగా పూర్తి చేస్తారనే సంగతి తెలిసిందే. అయితే సర్కారు వారి పాట షూటింగ్ మాత్రం నిదానంగా జరుగుతోంది. కరోనా సెకండ్ వేవ్ వల్ల దాదాపు రెండున్నర నెలలు షూటింగ్ ఆగిపోవడంతో ఈ మూవీ షూటింగ్ అంతకంతకూ ఆలస్యమైంది. సర్కారు వారి పాట మూవీ తరువాత షెడ్యూల్ షూటింగ్ స్పెయిన్ లో జరగనుంది. మరోమారు సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేసి హిట్ సాధించాలని మహేష్ భావిస్తున్నారు.

అయితే సర్కారు వారి పాట చివరి షెడ్యూల్ డిసెంబర్ లో పూర్తి కానుందని సమాచారం. సినిమాలో మహేష్ పాత్ర, డైలాగ్స్ చెప్పే విధానం కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. స్పెయిన్ లో ఈ సినిమా షూటింగ్ నెలరోజులు ఉంటుందని అక్కడ పాటల షూటింగ్ జరుగుతుందని సమాచారం. మహేష్ కు జోడీగా ఈ మూవీలో కీర్తి సురేష్ నటిస్తుండగా థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమాతో గతేడాది హిట్ ఖాతాలో వేసుకున్న మహేష్ సర్కారు వారి పాట సినిమాతో ఆ సినిమాను మించి విజయాన్ని సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారు.

మహేష్ బాబు ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాను పూర్తి చేసి రాజమౌళి సినిమాను మొదలుపెట్టాలని భావిస్తున్నారు. వచ్చే ఏడాది సెకండాఫ్ లో మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి. మహేష్ రాజమౌళి కాంబినేషన్ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. మహేష్ సర్కారు వారి పాట షూటింగ్ ను ఆలస్యంగా పూర్తి చేస్తూ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారని చెప్పాలి.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus