అమ్మే కీర్తి సురేష్ ని ఎంచుకుందనిపిస్తోంది : చాముండేశ్వరి

  • May 11, 2018 / 06:16 AM IST

“మహానటి చూడాల్సిందే భయ్యా… అబ్బబ్బా .. ఏమి సినిమా.. ఆ సినిమా చూస్తున్నంతసేపు గర్వంగా ఉంది”.. అంటూ యువ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిన సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అభినందనలు కురిపిస్తున్నారు. బుధవారం రిలీజ్ అయిన ఈ సినిమా మౌత్ టాక్ తో రోజురోజుకి కలక్షన్స్ పెంచుకుంటోంది.

మహానటి సావిత్రిగా కీర్తి సురేష్, సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించిన తీరు పదికాలాలపాటు నిలిచిపోతుంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ తో కలిసి స్వప్న దత్ నిర్మించిన ఈ మూవీ ఘన విజయం సాధించడంపై సావిత్రి కుమార్తె చాముండేశ్వరి ఆనందం వ్యక్తం చేశారు. “చిన్నతనం నుంచి అగ్రనటిగా అమ్మ ఎదిగిన తీరును ఈ సినిమా ద్వారా చూశాను” అని ఆమె అన్నారు.

“ఈ చిత్రంలో కీర్తి నటన చూసిన తర్వాత తన పాత్ర కోసం కీర్తి సురేష్ ను స్వయంగా అమ్మే ఎంచుకుందని అనిపిస్తోంది” అని సంబరపడ్డారు. ఇక సావిత్రి అల్లుడు గోవింద్ మాట్లాడుతూ.. “సావిత్రిని మించిన నటి లేరని.. అందరూ అంటుంటారు… సావిత్రిని మించిన నటి రావాలని నేను అనుకుంటూ ఉంటాను. ‘మహానటి’ చిత్రం ద్వారా నా కోరిక తీరింది. సావిత్రిని మించి కీర్తి సురేష్ నటించింది” అని వివరించారు. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లోనూ మంచి కలక్షన్స్ రాబడుతోది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus