Puri Jagannadh: పూరీపై షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రముఖ నటి..!

  • June 23, 2021 / 06:08 PM IST

బుల్లితెర, వెండితెర ఆఫర్లతో బిజీగా ఉంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న వాళ్లలో శ్రుతి ఒకరు. తాజాగా అలీతో సరదాగా షోకు నటి ప్రీతినిగమ్ తో కలిసి హాజరైన శ్రుతి ఈ షోలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అలీ మీ భర్త మధుని ఎలా కలిశారని అడగగా రుతురాగాలు సీరియల్ లో మధు నాతో కలిసి పని చేశారని కొన్నాళ్లకు ఆయన పెళ్లి ప్రపోజల్ పెట్టి అమ్మతో మాట్లాడారని వారం రోజుల టైమ్ తీసుకుని తాను పెళ్లికి ఓకే చెప్పానని శ్రుతి అన్నారు.

సీరియల్స్ లో నెగిటివ్ షేడ్స్ లో ఉన్న పాత్రల్లో ఎక్కువగా నటించడం వల్ల పిల్లలు కారు వెనుక, అమ్మ కొంగు వెనుక దాక్కుని తనను చూసేవారని శ్రుతి వెల్లడించారు. భర్తతో ఏదైనా గొడవ జరిగితే ఆయన నేరుగా కిచెన్ లోకి వెళ్లి గిన్నెలు కడిగేసి ఇల్లు శుభ్రం చేస్తారని శ్రుతి తెలిపారు. తాను మాత్రం గొడవ పడిన సమయంలో ఫోన్ చూస్తూ నిశ్శబ్దంగా ఉంటానని శ్రుతి చెప్పుకొచ్చారు. కెమెరా మెన్ గంగతో రాంబాబు షూటింగ్ సమయంలో మొగలిరేకులు సీరియల్ లో బాగా నటిస్తావని బ్రహ్మానందం ప్రశంసించారని శ్రుతి పేర్కొన్నారు.

పూరీ జగన్నాథ్ గురించి చెబుతూ పూరీతో ముప్పై ఏళ్లుగా స్నేహం అలాగే ఉందని శ్రుతి అన్నారు. డబ్బు, ఫేమ్ వచ్చినా పూరీ జగన్నాథ్ మారలేదని అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడని శ్రుతి తెలిపారు. పూరీ తనకు గర్ల్ ఫ్రెండ్ లాంటోడని పూరీతో తాను ఏ విషయాన్నైనా పంచుకోగలనని శ్రుతి అన్నారు. తాను పూరీ జగన్నాథ్ ను బాబు మొషాయ్ అని పిలుస్తానని శ్రుతి చెప్పుకొచ్చారు.


బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus