శంకర్, రజినీకాంత్ కలయికలో బయోపిక్ రానుందా?

  • June 13, 2018 / 04:04 AM IST

ప్రస్తుతం బయోపిక్ సీజన్ నడుస్తోంది. బాలీవుడ్ లో ధోనీ బయోపిక్ కాసులు కురిపించింది. తెలుగు, తమిళంలో తెరకెక్కిన సావిత్రి బయోపిక్ మహానటి ఘనవిజయం సాధించింది. ఈ ఉత్సాహంతో ఎన్టీఆర్ బయోపిక్ వేగంగా సిద్ధమవుతోంది. తాజాగా మరో బయోపిక్ కి అడుగులు పడుతున్నాయని కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఇది చేయబోయేది ఎవరో కాదు రజినీకాంత్. అది కూడా శంకర్  దర్శకత్వం వహించనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరి కలయికలో వచ్చిన రోబో సూపర్ హిట్.

తర్వాత వచ్చిన శివాజీ బ్లాక్ బస్టర్ హిట్. ఇక ఇప్పుడు మూడో సినిమా 2 .o పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. దీనిపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ క్రేజీ కాంబినేషన్లో బయోపిక్ అంటే అంచనాలు మామూలుగా ఉండదు. తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా ట్రాఫిక్ సమస్యల్ని పరిష్కరించడం కోసం రామస్వామి  పోరాటం చేశారు.జనాల్లో అవగాహన కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వంలోనూ కదలిక తెచ్చారు.  రామస్వామి గురించి పత్రికల్లో చదివి చాలా స్ఫూర్తి పొందానని.. కొన్నేళ్ల కిందట ఆయన కథతో సినిమా చేద్దామన్న ఆలోచన వచ్చిందని.. ఆయన పాత్రకు రజనీ చక్కగా సరిపోతారనిపించిందని శంకర్ రీసెంట్ గా వెల్లడించాడు.

అయితే అది కుదరలేదు. ఎందుకో అతను వివరిస్తూ… “ఎస్.ఎ.చంద్రశేఖర్ (హీరో విజయ్ తండ్రి) తన స్వీయ దర్శకత్వంలో రామస్వామి బయోపిక్ లో నటించబోతున్నట్లు అనౌన్స్ చేశారు. అది తెలిసి ఒకింత నిరాశ చెందాను. కానీ తర్వాత రామస్వామి పాత్రకు చంద్రశేఖర్ చక్కగా సరిపోతారని భావించి సంతృప్తి చెందాను” అని శంకర్ స్పష్టంచేశారు. కానీ రజిని అభిమానులు ఈ బయోపిక్ రజినీ చేస్తే చూడాలని కోరుకుంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus