‘రోబో 2.0’ తర్వాత శంకర్ సినిమా ఏంటంటే..

  • May 16, 2016 / 10:16 AM IST

భారతదేశం గర్వించదగ్గ దర్శక దిగ్గజాల్లో శంకర్ ఒకరు. ప్రస్తుతం ఆయన రజనీకాంత్ తో “రోబో 2.0” చిత్రాన్ని తెరకెక్కిస్తూ యమ బిజీగా ఉన్నాడు. బాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడైన అక్షయ్ కుమార్ ప్రతినాయక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో అమీ జాక్సన్ కథానాయికగా నటిస్తోంది.

“రోబో 2.0” అనంతరం శంకర్ దర్శకత్వం వహించబోయే తదుపరి సినిమా ఏంటా? అని ఇప్పట్నుంచే అందరూ చర్చీంచుకొంటున్నారు. విక్రమ్ తో ఓ సినిమా ఉంటుందని కొందరు అంటుండగా, మహేష్ బాబుతో సినిమా ఉండొచ్చని ఇంకొందరు చెబుతున్నారు. ఈ కన్ఫ్యూజన్ కు క్లారిటీ ఇచ్చారు సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్. ఇటీవల ఓ టివి చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “రోబో తర్వాత శంకర్ సార్ తో కలిసి మరో సినిమాకి పని చేయనున్నాను. “భారతీయుడు” సినిమాకి సీక్వెల్ గా “భారతీయుడు 2″ను ప్లాన్ చేస్తున్నాడాయన” అన్నారు.

శంకర్-కమల్ ల కాంబినేషన్ లో వచ్చిన “భారతీయుడు” ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అందుకే ఆ మ్యాజిక్ ను రిపీట్ చేస్తూ.. వారిద్దరి కాంబినేషన్ లో రూపొందనున్న తాజా చిత్రంగా “భారతీయుడు”కు సీక్వెల్ గా “భారతీయుడు 2” తెరకెక్కించాలని ఫిక్స్ అయినట్లున్నాడు శంకర్.
“భారతీయుడు 2” ఎప్పుడు మొదలవుతుంది? ఎవరు నిర్మిస్తారు? కథానాయికలుగా ఎవరు నటిస్తారు? వంటి విషయాలు తెలియాలంటే కొన్నాళ్లు.. కాదు కాదు కొన్నేళ్ళు ఆగాల్సిందే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus