సెల్ఫీ రాజాకు ఎక్స్ ప్రెస్ రాజా వాయిస్ ఓవర్..!!

  • July 12, 2016 / 01:23 PM IST

కామెడీ హీరో అల్లరి నరేష్ నాలుగేళ్లుగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. “మామ మంచు అల్లుడు కంచు” సినిమా తర్వాత ఏడాది టైం తీసుకుని చేస్తున్న సెల్ఫీ రాజా పైనే ఆశలు పెట్టుకున్నారు. గోపీ ఆర్ట్స్ పతాకంపై చలసాని రామబ్రహ్మం చౌదరి నిర్మాణ సారథ్యంలో ‘సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం’ సినిమా ఫేం జి. ఈశ్వర్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో సాక్షి చౌదరి, కామ్నా రనవత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

రీసెంట్ గా విడుదలైన ఈ చిత్ర టైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. సాయి కార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమా జూలై 15న విడుదలకానుంది. తేదీ దగ్గర పడుతుండడంతో సెల్ఫీ రాజా టీమ్ ఓ వైపు ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంటూనే మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను వేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ రోజు (సోమవారం) సెల్ఫీ రాజా చిత్రం కోసం ఎక్స్ ప్రెస్ రాజా శర్వానంద్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. శర్వానంద్ చక్కగా వాయిక్ ఓవర్ ఇచ్చారని, ఆయన మాటలతో ప్రేక్షకుడు కథలోకి వెళతారని చిత్ర బృందం తెలిపింది. ఎక్స్ ప్రెస్ రాజా వాయిస్ ఓవర్ ఇచ్చిన అనంతరం ఆ ఫోటోలను అల్లరి నరేష్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus