కంఫర్ట్ కోసం స్టార్ ఇమేజ్ ను దూరం చేసుకుంటున్నాడా?

  • December 19, 2018 / 11:51 AM IST

ఒక హిట్ ఇచ్చిన డైరెక్టర్ కథ వినిపిస్తే చాలు వెంటనే ఓకే చెప్పేస్తారు చాలా మంది హీరోలు. అయితే శర్వానంద్ మాత్రం ఇందుకు భిన్నంగా చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ ను ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో ఒక్కసారిగా స్టార్ హీరోను చేసేసాడు సందీప్ రెడ్డి. అలాంటి డైరెక్టర్ తో చేయడానికి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఇంట్రస్ట్ చూపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే శర్వానంద్ సందీప్ రెడ్డి వంగాతో చిత్రానికి నో చెప్పాడంట.

‘అర్జున్ రెడ్డి’ చిత్ర కథను మొదట శ‌ర్వానంద్‌ కే వినిపించాడంట సందీప్. అయితే శర్వా నో చెప్ప‌డంతో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో చేసి హిట్టు కొట్టేసాడు . ఇదిలా ఉంటే తాజాగా మరోసారి శ‌ర్వానంద్‌ ను క‌లిసి మరో కథను వినిపించాడ‌ట. దీనికి కూడా నో చెప్పాడంట శర్వా. తను కంఫర్ట్ ఫీల‌య్యే కథలను మాత్ర‌మే ఓకే చేస్తాన‌ని గతంలో శ‌ర్వానంద్ చెప్పకనే… చెప్పాడు. క‌థ న‌చ్చ‌క‌పోతే మొహమాటం లేకుండా నో చెప్పేస్తున్నాడట. అయితే శ‌ర్వానంద్ మాస్ పాత్రలో ‘ప్రస్థానం’ సినిమా చేసాడు, ఎంటర్టైనింగ్ క్యారెక్టర్లో ‘రన్ రాజా రన్’ చేసాడు, ఇక లవర్ బాయ్ గా ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ చిత్రం చేసాడు, అంతేకాదు ‘అమ్మ చెప్పింది’ ‘గమ్యం’ ‘ఎక్స్ ప్రెస్ రాజా’ ‘మహానుభావుడు’ వంటి విభిన్న చిత్రాలెన్నో చేసాడు. మరి ఇంకా శర్వా కు కంఫర్ట్ మిస్సవుతున్న పత్రలేమిటో అనే సందేహమైతే రాక మానదు. ఇక తాజాగా హ‌నురాఘ‌వ పూడి డైరెక్షన్లో శర్వా నటించిన ‘ప‌డిప‌డి లేచే మ‌న‌సు’ చిత్రం డిసెంబర్ 21న విడుద‌ల కాబోతుంది. సాయి ప‌ల్ల‌వి హీరోయిన్ గా న‌టించిన ఈ చిత్రం అందమైన ప్రేమకథగా రూపొందింది. ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సుధీర్ వర్మ డైరెక్షన్లో చేస్తున్న చిత్రం కూడా దాదాపు పూర్తయిందట. త్వరలోనే ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ విడుదల కాబోతోందని సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus