Sharwanand Remuneration: కోటి తగ్గించి తీసుకుంటున్న హీరో శర్వానంద్..!

  • June 26, 2021 / 11:45 AM IST

‘ఆర్.ఎక్స్.100’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత దర్శకుడు అజయ్ భూపతి …తెరకెక్కిస్తున్న చిత్రం ‘మహాసముద్రం’. ఒకప్పుడు లవర్ బాయ్ గా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సిద్ధార్థ కూడా ఈ చిత్రంలో సెకండ్ హీరోగా నటిస్తున్నాడు. అదితి రావు హైదరి,అనూ ఇమాన్యుల్ లు హీరోయిన్లు. ప్రేమ, స్నేహం, కక్ష సాధింపు వంటి అంశాలతో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది.’ఎకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ బ్యానర్ పై అనిల్‌ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆగష్టు 19న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు

కానీ కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో ఆ డేట్ కు రావడం కష్టమని చిత్ర యూనిట్ సభ్యులు తేల్చేసారు. వరుస ప్లాప్ లతో సతమతమవుతున్న శర్వానంద్ కు ‘మహాసముద్రం’ మూవీ పెద్ద రిలీఫ్ ఇస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం కోసం నిర్మాత అనిల్ సుంకర ఏకంగా రూ.40 కోట్ల పైనే బడ్జెట్ పెడుతున్నాడట. శర్వానంద్ కెరీర్లో ఇదే హైయెస్ట్ బడ్జెట్ అని ఇండస్ట్రీ టాక్.

అయితే తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు కాబట్టి.. ఇంకా అది తక్కువే అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రం కోసం శర్వానంద్ రూ.6 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడట. గతంలో కరోనా లాక్ డౌన్ కు ముందు శర్వానంద్ రూ.7 కోట్ల వరకు పారితోషికం అందుకునేవాడని.. అయితే లాక్ డౌన్ వల్ల నిర్మాతల పరిస్థితిని అర్థం చేసుకుని అతను కోటి తగ్గించినట్టు తెలుస్తుంది.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus