టెంపర్ రీమేక్ పై విమర్శలు గుప్పిస్తున్న విశ్లేషకులు

  • December 30, 2018 / 12:03 PM IST

టాలీవుడ్ లో సూపర్ హిట్ కొట్టడమే కాక ఎన్టీఆర్ కెరీర్ లో కలికితురాయిలా నిలిచిపోయిన “టెంపర్” చిత్రాన్ని బాలీవుడ్ లో “సింబా” పేరుతో రణవీర్ సింగ్ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి మంచి రివ్యూలు వచ్చి బాక్సాఫీస్ దగ్గర హల్ చల్ చేస్తున్నప్పటికీ.. మన తెలుగు సినిమా స్థాయిలో లేదని మాత్రం అందరూ అంటున్నారు. రోహిత్ శెట్టి బాలీవుడ్ వెర్షన్ కు భారీ స్థాయిలో మార్పులు చేయడమే ఇందుకు కారణం. ఆఖరికి సినిమాకి చాలా కీలకమైన క్లైమాక్స్ ను కూడా మార్చేశాడు రోహిత్ శెట్టి. దాంతో టెంపర్ స్థాయి ఎమోషన్ సింబాలో కనిపించలేదు.

ముఖ్యంగా.. కామెడీని అద్భుతంగా పండించిన రోహిత్ శెట్టి, ఎన్టీఆర్ స్థాయి ఎమోషన్ & ఇంటెన్సిటీని మాత్రం పలికించలేకపోయాడు. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాక టెంపర్ సినిమా చూసినవాళ్ళందరూ కూడా ఆ సినిమా రేంజ్ లో లేదు అని తేల్చేస్తున్నారు. దాంతో రోహిత్ శెట్టి చాలా బాధపడుతున్నాడట. ఎందుకంటే.. ఇంతకుముందు ఇదే తరహాలో తనదైన శైలి మార్పులతో (“సింగం” తెలుగులో “యముడు”) చిత్రానికి రీమేక్ గా తీసిన సింఘంకి వచ్చిన పాజిటివ్ టాక్ లో సగం కూడా ఈ సినిమాకి రాలేదు మరి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus