నందమూరి తారకరత్నకు షాకిచ్చిన .. జీ.హెచ్.ఎం.సి అధికారులు..!

  • February 5, 2019 / 10:27 AM IST

సినీ నటుడు నందమూరి తారకరత్నకు జీ.హెచ్.ఎం.సి అధికారులు షాకిచ్చారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లో ఉన్న తారకరత్నకు చెందిన ‘కబరా డ్రైవ్ ఇన్’ అనే రెస్టారెంటును కూల్చివేసేందుకు జీ.హెచ్.ఎం.సి అధికారులు ప్రయత్నించారు. ఏ మేరకు.. ఇలా కూలుస్తున్నారంటూ జీ.హెచ్. ఎం.సి అధికారులతో రెస్టారెంట్ నిర్వాహకులు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తం నెలకొంది. ఈ క్రమంలో.. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారని తమకు ఫిర్యాదు రావడంతో కూల్చడానికి వచ్చామని అధికారులు చెప్పగా.. విషయం తెలుసుకున్న తారకరత్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు.

ఈ క్రమంలో… తారకరత్న తనకు కొంత సమయం ఇవ్వమని జీ.హెచ్.ఎం.సి అధికారులను కోరగా వారు మూడు గంటల వరకూ సమయం ఇచ్చారు. ఈ లోపుగా రెస్టారెంట్ కి సంబందించిన సామాగ్రిని తరలించే పనిలో సిబ్బంది పడ్డారు. ఇలా ఎందుకు జరిగిందని పరిశీలించగా.. డ్రైవ్‌ఇన్ రెస్టారెంట్‌ను నిబంధనలకు విరుద్ధంగా రెసిడెన్షియల్ ఏరియాలో నడుపుతున్నారని… అర్దరాత్రి వేళ మద్యం తాగుతూ, డీజే సౌండ్స్‌తో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని ఎమ్మెల్యే కాలనీలోని సొసైటీ సభ్యులు జీ.హెచ్.ఎం.సి అధికారులకు ఫిర్యాదు చేసినట్లు స్పష్టమవుతుంది. ఈ కారణం వలెనే జీ.హెచ్.ఎం.సి సిబ్బంది తారక రత్న రెస్టారెంట్ ను కూల్చేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus