Shreya Ghoshal: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన శ్రేయా ఘోషల్

  • May 22, 2021 / 06:44 PM IST

మ్యూజిక్ లవర్స్ కు ఎంతో ఇష్టమైన గాయనిమణుల్లో శ్రేయా ఘోషల్ ఒకరు. ఆమె పాటను ఆస్వాదించని వారు ఉండరు. ఎలాంటి సాంగ్ పాడినా కూడా చెవులకు ఒక తేనె లాంటి రుచిని కలిగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న శ్రేయా ఘోషల్ మొదటిసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. 37 ఏళ్ల వయసులో ఒక మగబిడ్డకు జన్మనిచ్చిన శ్రేయా ఘోషన్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఎమోషనల్ అవుతూ వివరణ ఇచ్చారు.

ఈ రోజు మధ్యాహ్నం దేవుడు మాకు ఒక బంగారం లాంటి బిడ్డను ప్రసాదించాడని చెబుతూ ఇలాంటి ఎమోషన్ ను నా జీవితంలో చూడలేదని నా కుటుంబ సభ్యుల్లో కూడా చాలా ఆనందాన్ని నింపిన విశేషమని అన్నారు. అలాగే మా చిన్న ఆనందానికి మీ లెక్కలేనన్ని ఆశీర్వాదాలు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.. అని శ్రేయా వివరణ ఇచ్చారు. ఇక శ్రేయా ఘోషల్ 2015లో శిలాదిత్యా ముఖోపధ్యాయా అనే వ్యాపారవేత్తను ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకున్నారు.

ఇక ఇప్పుడు ఈ దంపతులు పండంటి మగబిడ్డకు జన్మనివ్వడంతో అభిమానులతో పాటు గాయని గాయకులు, సినీ నటులు కూడా ప్రత్యేకంగా విషెస్ అందిస్తున్నారు.


Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus