Shruti Haasa: ప్రజలు కష్టాల్లో ఉంటే ఈ పార్టీలేంటి..?

  • April 22, 2021 / 04:14 PM IST

కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. రోజుకి వేల సంఖ్యలో జనాలు మరణిస్తున్నారు. మరోపక్క ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. అయితే ఇలాంటి సమయంలో కొందరు సెలబ్రిటీల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. ఈ మధ్యకాలంలో చాలా మంది తారలు హాలిడే ట్రిప్ లకు వెళ్లారు. దీనిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. తాజాగా ఇదే అంశాన్ని తప్పుబడుతూ నటి శృతిహాసన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

విహారయాత్రలకు వెళ్లే హక్కు, డబ్బు వాళ్లకు ఉన్నప్పటికీ.. ఇలాంటి సమయంలో అలాంటి పనులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించింది శృతి. కరోనాతో పోరాడుతున్న కొంతమంది వ్యక్తులకు ఇది చాలా కఠినమైన సమయమని.. ఇలాంటి సమయంలో కొంతమంది తారలు విహారయాత్రలకు వెళ్లడం కరెక్ట్ కాదంటూ విమర్శలు చేసింది. ప్రజల మనోభావాలను గుర్తించాలని.. వాళ్లు కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీలు చేసుకోవడం, ట్రిప్ లకు వెళ్లడం మంచిది కాదన్న శృతి.. తనవంతుగా ప్రజలకు ఉపయోగపడే ఎలాంటి సమాచారాన్నైనా..

షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించింది. కొద్దిరోజుల క్రితం సెలబ్రిటీలంతా మాల్దీవులకు ట్రిప్ కు వెళ్లి అక్కడ సేద తీరారు. అయితే కరోనా సెకండ్ వేవ్ మొదలైన తరువాత కూడా కొంతమంది తారలు వెకేషన్ కి వెళ్తున్నారు. రణబీర్, అలియా, జాన్వీ కపూర్, దిశా పటానీ లాంటి తారలు ట్రిప్ కి వెళ్లడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు.


Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus