400 కోట్ల బడ్జెట్ సినిమాలో శృతిహాసన్

  • February 15, 2017 / 11:23 AM IST

విశ్వనటుడు కమలహాసన్ కుమార్తె శృతిహాసన్ కి ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఆమెకు భారీ బడ్జెట్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. కోలీవుడ్‌ దర్శకుడు, ఖుష్భూ భర్త సుందర్‌. సి భారీ బడ్జెట్‌తో ‘సంఘమిత్ర’ అనే హిస్టారికల్‌ మూవీనీ తెరకెక్కించనున్నారు. శ్రీతేనాండాళ్‌ ఫిలింస్‌ సంస్థ తన నూరవ చిత్రంగా దీనిని 400 కోట్లతో నిర్మించడానికి సిద్ధమైంది. మరో బాహుబలిగా అభివర్ణిస్తున్న ఈ సినిమా కోసం ఏడాది నుంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఏకకాలంలో తెలుగు, తమిళంలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో కోలీవుడ్ ఇళయదళపతి విజయ్, టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ని నటింపజేయించాలని డైరక్టర్ ప్రయత్నించారు.

వారు ఆసక్తి చూపించక పోవడంతో ఆర్య, జయం రవిలు తీసుకున్నారు. వారి పక్కన హీరోయిన్స్ గా అనేకమందిని పరిశీలించిన చిత్ర బృందం శృతిహాసన్ ని ఎంపిక చేసింది. మరో హీరోయిన్ కోసం అన్వేషిస్తోంది.  400 కోట్ల బడ్జెట్ సినిమాలో ఛాన్స్ రావడంతో శృతి ఎంతో ఆనందంగా ఉంది. ప్రస్తుతం ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం వచ్చే నెల 24 న రిలీజ్ కానుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus