Shruti Haasan: ”నా పేరెంట్స్ విడిపోయి మంచిపనే చేశారు”

  • May 25, 2021 / 05:47 PM IST

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న శృతిహాసన్ బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. రీసెంట్ గా శృతి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమె తన తల్లిదండ్రులు కమల్ హాసన్, సారికలు విడిపోవడంపై షాకింగ్ కామెంట్స్ చేసింది. వారిద్దరూ విడిపోవడం కరెక్ట్ అని.. వాళ్లు విడాకులు తీసుకున్నందుకు తను సంతోషంగా ఉన్నట్లు చెబుతోంది శృతి. ఇద్దరు వ్యక్థలు కలిసి బతకలేమని అనుకున్నప్పుడు విడిపోవడమే మంచిదని..

తిట్టుకుంటూ, కొట్టుకుంటూ రాజీ పడి బ్రతకడం కరెక్ట్ కాదని చెప్పింది శృతి. తన దృష్టిలో తన పేరెంట్స్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని సమర్ధించింది. వాళ్లు విడిపోయినప్పుడు తను చాలా చిన్న పిల్లనని.. వాళ్లు కలిసి ఉన్నప్పుడు కంటే విడిపోయిన తరువాత చాలా సంతోషంగా ఉన్నారని చెప్పగలనని వెల్లడించింది. ఇప్పుడు వారిద్దరి మధ్య మాటల్లేనప్పటికీ తల్లిదండ్రులుగా ఇద్దరూ తనతో ఎంతో ప్రేమగా ఉంటారని.. తన జీవితంలో కీలక పాత్రలు పోషిస్తారని చెప్పుకొచ్చింది.

కమల్, సారిక 1980లలో డేటింగ్ చేసి పెళ్లి చేసుకున్నారు. వీరికి 1986 లో శృతిహాసన్ జన్మించగా.. 1991లో అక్షర హాసన్ పుట్టింది. ఇక 2004లో కమల్, సారిక డివోర్స్ తీసుకొని సెపరేట్ అయ్యారు. ఆ తరువాత కమల్ చాలా కాలం గౌతమితో సహజీవనం చేశారు. ఇప్పుడు ఆమె కూడా కమల్ నుండి విడిపోయింది.

Most Recommended Video

10 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు మరియు వారి అలవాట్లు..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!
ఈ 15 మంది సెలబ్రిటీలు బ్రతికుంటే మరింతగా రాణించే వారేమో..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus