Sunitha: ఆ బాధలో అలాగే ఉండిపోవాలనిపిస్తుంది: సునీత

  • March 17, 2023 / 05:44 PM IST

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సింగర్ సునీతకు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే. ఇలా ఈమెను అభిమానించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.ఇలా ఇండస్ట్రీలో సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పలు బుల్లితెర కార్యక్రమాలకు వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి సునీత సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

ఇకపోతే డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన రంగ మార్తాండ సినిమా గురించి తాజాగా సునీత ఎమోషనల్ కామెంట్స్ చేశారు. కృష్ణవంశీ చాలా రోజుల తర్వాత రంగమార్తాండ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో రమ్యకృష్ణ ప్రకాష్ రాజ్ బ్రహ్మానందం వంటి సెలబ్రెటీలు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ పనులను పూర్తిచేసుకుని ఉగాది పండుగ సందర్భంగా మార్చి 22వ తేదీ విడుదలకు సిద్ధమైంది.

ఈ సినిమా మార్చి 22వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో సెలబ్రిటీల కోసం ఈ సినిమా ప్రీమియర్ షో వేశారు. ఈ సినిమాని పలువురు దర్శక నిర్మాతలు, సెలబ్రిటీలు వీక్షించారు. అనంతరం ఈ సినిమాపై వారి అభిప్రాయాలను తెలియజేశారు.ఈ క్రమంలోనే రంగమార్తాండ సినిమా చూసినటువంటి సింగర్ సునీత ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా చూసిన తర్వాత గుండె మొత్తం బరువెక్కి పోయిందని మనసు గుబులుగా ఉందని తెలిపారు.

ఇలా మనసు గుబులుగా ఉన్నప్పుడు ఆ బాధ నుంచి బయటపడాలని ప్రయత్నం కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఆ బాధలో అలాగే ఉండిపోవాలనిపిస్తుంది అంటూ ఈమె తెలిపారు. ఇలా నటీనటుల నుంచి ఈ విధమైనటువంటి పర్ఫామెన్స్ బయటకు రాబట్టే సత్తా కృష్ణవంశీ గారికి మాత్రమే ఉందంటూ ఈ సందర్భంగా ఈమె రంగమార్తాండ సినిమా గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus