ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న శివాజీ రాజా కొడుకు సినిమా ‘వేయి శుభములు కలుగు నీకు’

  • March 11, 2023 / 10:29 AM IST

టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ రాజాకు ఉన్న గుర్తింపు అందరికీ తెలిసిందే. శివాజీ రాజా తనయుడిగా ‘వేయి శుభములు కలుగు నీకు’ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు విజయ్ రాజా.  ఈ చిత్రం ఇప్పుడు భవానీ మీడియా సంస్థ ద్వారా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.

లవ్, కామెడీ, హారర్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఈ చిత్రంలో విజయ్ రాజా నటన అందరినీ మెప్పిస్తుంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు.

జామి లక్ష్మీ ప్రసన్న సమర్పణలో జయ దుర్గాదేవి మల్టీ మీడియా పతాకంపై రామ్స్ రాథోడ్ దర్శకత్వంలో  తూము నరసింహా పటేల్ మరియు జామి శ్రీనివాస రావులు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

విజయ్ రాజాకు జోడిగా తమన్నా వ్యాస్ నటించారు. మాస్టర్ జయదేవ్‌, శివాజీ రాజా, ఢీ ఫేం ఫాల్గుణి,  సత్యం రాజేష్, జ్ఞాన ప్రియా, వెంకట్ నారాయణ, అపూర్వ, మీనా, అనంత్, షాయాజి షిండే,  శ్రీకాంత్ అయంగార్, రోహిణి, జబర్దస్త్  అప్ప రావు, జబర్దస్త్ మురళి, రేసింగ్ రాజు, కోట యశ్వంత్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus