ఎస్పీ బాలు లక్ష్యాల్లో అదొక్కటీ తీరలేదు!

  • September 25, 2020 / 02:41 PM IST

కుమారుడు కర్ణాటక సంగీత కచ్చేరి చేస్తే వినాలని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తండ్రి సాంబమూర్తి ఆశపడ్డారు. ఆ కోరిక తీరకుండానే సాంబమూర్తి వెళ్ళిపోయారు. అయితే, ఎప్పుడో ఒకప్పుడు కర్ణాటక సంగీత కచ్చేరి చెయ్యాలని ఎస్పీ బాలు తాపత్రయపడ్డారు. తండ్రి కోరిక మేరకు ఎప్పటికైనా కర్ణాటక సంగీతంలో కచ్చేరీ చెయ్యాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. అది తీరకుండానే ఆయన కూడా తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. ఎస్పీ బాలు పెర్ఫెక్షనిస్ట్. ప్రతి పనిలో పర్ఫెక్షన్ వుండాలని ఆయన కోరుకుంటారు.

పేరుకు కర్ణాటక సంగీత కచ్చేరి ఇచ్చి మమ అనిపించుకోవడం ఆయనకు ఇష్టం లేదు. అందుకని, ఆరు నెలల పాటు కర్ణాటక సంగీతం నేర్చుకుని పోయేలోపు కచ్చేరి ఇవ్వాలని అనుకున్నారు. ,ప్రముఖ సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఓ అవకాశం కూడా ఇచ్చారు. “నా దగ్గరకు రా. ఆరు నెలల్లో అన్నీ నేర్పుతా’ అని చెప్పార్ట. ఆరు నెలలు ఖాళీ చేసుకుని వెళ్ళడం బాలుకి అప్పట్లో సాధ్యపడలేదు. రోజుకు కనీసం రెండు పాటలు అయినా పాడేవారు. ఇక, ఖాళీ ఎక్కడ వుంటుంది చెప్పండి?

ఒకసారి తిరువయ్యారులో త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో పాడటానికి రమ్మని ఎస్పీ బాలుకి ఆహ్వానం వచ్చింది. కర్ణాటక సంగీత కచ్చేరి ఇవ్వమని పిలిచారు. వాళ్ళు ధైర్యం చేశారు కాని బాలు చెయ్యలేకపోయారు. తండ్రి కోరికతో పాటు తన ఆశయం, లక్ష్యం కూడా తీరకుండా బాలు వెళ్ళిపోయారు.

1

2

3

4

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus