కరోనాను జయించినా వెంటిలేటర్ పైనే బాలు

  • September 7, 2020 / 07:31 PM IST

గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం కోవిడ్ ని జయించారు. తాజా రిపోర్ట్ లలో బాలుగారికి కరోనా నెగెటివ్ వచ్చినట్లు డాక్టర్స్ నిర్ధారించారు. ఈ విషయాన్ని బాలు కుమారుడైన ఎస్పీ చరణ్ ధృవీకరించారు. కొద్దిరోజులుగా బాలు ఆరోగ్యంపై ఎటువంటి అప్డేట్ ఇవ్వని చరణ్ నేడు ఓ గుడ్ న్యూస్ పంచుకున్నారు. కరోనా టెస్టులలో బాలుగారికి కరోనా నెగెటివ్ వచ్చినట్లు ఆయన వీడియో సందేశంలో తెలియజేశారు. ఐతే బాలుగారి ఊపిరితిత్తులు పూర్తిగా సాధారణ స్థితికి రాలేదని చెప్పారు.

దాని వలన ఇంకా ఆయనకు వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నట్లు తెలియజేశారు. దీనితో కరోనా వైరస్ నుండి బాలు కోలుకున్నప్పటికీ ఆయన ఆరోగ్యం పూర్తిగా అదుపులోకి రాలేదని అర్థం అవుతుంది. ఇక బాలు కరోనా బారిన పడి నెలరోజులు దాటిపోతుంది. గత నెల 5న కరోనా సోకిందంటూ చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో ఆయన జాయిన్ కావడం జరిగింది. అప్పటి నుండి ఆయన కరోనాతో పోరాటం సాగిస్తున్నారు. కరోనా కారణంగా ఆయన ఊపిరి తిత్తులు తీవ్రంగా దెబ్బతినడం జరిగింది.

దీనితో ఆయనకు మూడు వారాలుగా వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నారు. వారం రోజులుగా ఆయన ఆరోగ్యం కొంత మెరుగుపడినట్లు తెలుస్తుంది. బాల సుబ్రహ్మణ్యం కోలుకోవాలని టాలీవుడ్ మరియు కోలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

Most Recommended Video

వి సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్…!
ఆ చిత్రాలు పవన్ చేసి ఉంటే బాక్సాఫీస్ బద్దలు అయ్యేది..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus