నాన్న నాకు ఎదో రాసి చూపించాలనుకున్నారు: ఎస్పీ చరణ్

  • August 27, 2020 / 11:47 AM IST

మూడు వారాలుగా సింగర్ బాలసుబ్రమణ్యం కరోనాతో పోరాడుతున్న సంగతి తెలిసిందే. దేశం మొత్తం ఆయన కోలుకొని తిరిగి రావాలని కోరుకుంటున్నారు. అలాగే బాలు ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. దీనితో ఆయన కమారుడు ఎస్పీ చరణ్ ప్రతి రోజు బాలు ఆరోగ్యంపై సమాచారం పంచుకుంటున్నారు. కాగా నేడు ఆయన బాలు ఫ్యాన్స్ కి ఆనందం పంచే న్యూస్ తో వచ్చారు.

బాలు ఆరోగ్యం మెరుగైందని ఆయన చెప్పడం విశేషం. ఎస్పీ చరణ్ తన వీడియో సందేశంలో గతంలో పోల్చుకుంటే బాలు ఆరోగ్యం మెరుగుపడింది అన్నారు. ఆయన ఊపిరి తిత్తులు రికవరీ అవుతున్న ఛాయలు కనిపించినట్లు ఎంజిఎం వైద్యులు చెప్పారు అన్నారు. ఇక చరణ్ తండ్రి బాలును కలిసినట్లు చెప్పారు. ఆయన తనకు ఎదో రాసి చెప్పాలనుకున్నారని అన్నారు. ఐతే ఆయన పెన్ పట్టుకోలేకపోయారు అని తెలిపారు.

అలాగే బాలు మ్యూజిక్ వింటున్నట్లు, డాక్టర్స్ మరియు బంధువులను గుర్తిస్తున్నట్లు చెప్పడం జరిగింది. చాలా కాలం తరువాత ఎస్పీ చరణ్ మంచి న్యూస్ పంచుకున్నారు. కొద్దిరోజుల క్రితం వరకు బాలు ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలియజేసిన సంగతి తెలిసిందే. తాజా ప్రకటనతో బాలు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగివస్తారనే నమ్మకం బలపడింది. బాలు కోలుకోవాలని టాలీవుడ్ మరియు కోలీవుడ్ లో ప్రార్ధనలు చేశారు.

Most Recommended Video


మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus