మహేష్ మూవీ రోజుకి ఐదు ఆటలు?

  • September 19, 2017 / 02:34 PM IST

కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘స్పైడర్’ ఈనెల 27 న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా, ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై  ఎన్.వి.ప్రసాద్ వందకోట్లతో నిర్మించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు కలుపుకొని 156 .4 కోట్ల బిజినెస్ చేసి మహేష్ సత్తాని చాటింది. కేవలం థియేటర్ రైట్స్ మాత్రమే 121.4  కోట్లు పలికింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో 69 .6 కోట్లకు థియేటర్ హక్కులు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. భారీ ధరకు కొనుగోలు చేయడంతో కొన్న మొత్తం మూడు రోజుల్లో రావాలని డిస్ట్రిబ్యూటర్లు ప్లాన్ వేశారు.

అదనపు షోలు వేయాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం కృష్ణా, ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాలకు చెందిన డిస్ట్రిబ్యూటర్లు స్పైడర్ సినిమాకు సంబంధించి ఎక్స్ ట్రా షోల ప్రత్యేక అనుమతి కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు. అర్థరాత్రి లేదా ఎర్లీ మార్నింగ్ షోలకు అనుమతి వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. కనీసం 2  రోజుల పాటు ఎక్స్ ట్రా షోలకు అనుమతి వస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు. దీనిపై అధికారుల నిర్ణయం త్వరలో తెలియనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus