ఎన్టీఆర్ సినిమా రీమేక్ లో కనిపించనున్న అతిలోక సుందరి కుమార్తె!

  • November 17, 2017 / 11:03 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని పూర్వవైభవాన్ని తీసుకొచ్చిన సినిమా టెంపర్. ఇందులో ఎన్టీఆర్ నటన అదరహో అనిపించింది. అందుకే ఈ కథని హిందీలో తీయడానికి సిద్ధమయ్యారు. ‘గోల్‌మాల్‌ ఎగైన్‌’ సినిమా హిట్ తో ఫామ్ లో ఉన్న దర్శకుడు రోహిత్‌ శెట్టి దీనిని డైరక్ట్ చేయనున్నారు. రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా నటించే ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రీదేవి కూతురు జాహ్నవి నటిస్తుందని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. తెలుగులో ఈ చిత్రాన్ని చూసిన శ్రీదేవి.. ఇందులో తన కూతురు నటిస్తే ఒక హిట్ గ్యారంటీ అనే నమ్మకంతో ఉన్నారు. అందుకే తన భర్త బోనీ కపూర్ తో కలిసి సంప్రదింపులు చేస్తున్నట్టు సమాచారం.

దీనిపై డైరెక్టర్ స్పందిస్తూ .. “సినిమాలో హీరోయిన్‌ని ఇంకా ఫైనలైజ్‌ చెయ్యలేదు. హీరోయిన్ గా కొందరి పేర్లు పరిశీలిస్తున్నాం. ఫైనల్ కాగానే అధికారికంగా ప్రకటిస్తాం.” అని స్పష్టం చేశారు. ఇంకా అతను మాట్లాడుతూ.. ” టెంపర్ రీమేక్ కి ఇంకా స్ర్కిప్ట్‌ వర్క్‌ పూర్తి కాలేదు. రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా నటిస్తారు. మేమిద్దరం కలసి చేసే తొలి సినిమా ఇదే. రణవీర్‌కి సరిగ్గా సూట్‌ అయ్యే పాత్ర అది. వచ్చే ఏడాది షూటింగ్‌ ప్రారంభిస్తున్నాం. 2018 డిసెంబర్‌లో విడుదల చేస్తాం” అని రోహిత్ శెట్టి వెల్లడించారు. అందాల సుందరి తనయురాలు జాహ్నవి ఈ సినిమాలో నటిస్తే మరింత క్రేజ్ పెరుగుతుందని బాలీవుడ్ సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏమి జరుగుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus