ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా కోసం రెండు పాటలను కంప్లీట్ చేసిన థమన్

  • May 12, 2018 / 11:31 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గతచిత్రాలైన బృందావనం, బాద్షా లకు ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందించారు. ఇప్పుడు మూడో సారి ట్యూన్స్ ఇస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ కి త్రివిక్రమ్ టీమ్ లో పనిచేయాలని ఎప్పటి నుంచో కోరిక. ఆ కోరిక ఈ సినిమాతో తీరింది. తనకిష్టమైన హీరో, డైరక్టర్ కోసం అదిరిపోయే సాంగ్స్ కంపోజ్ చేసే పనిలో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం థమన్ .. రెండు ఫాస్ట్ బీట్ సాంగ్స్ కంపోజ్ పూర్తి చేసినట్లు తెలిసింది. ముంబైలో రికార్డింగ్ కూడా కంప్లీట్ చేశారు. మిగతా పాటల కోసం దర్శకుడితో చర్చలు సాగిస్తున్నారు. ఇక షూటింగ్ విషయానికి వస్తే.. ఈ సినిమా మొదటి షెడ్యూల్ హైదరాబాద్ శివారులలో పూర్తి అయింది.

యాక్షన్ సీన్ చిత్రీకరించారు. త్వరలో రామోజీ ఫిలిం సిటీలో షూట్ చేయనున్నారు. నాలుగు కోట్లతో రాయలసీమలోని ఒక గ్రామానికి చెందిన సెట్ ని అక్కడ నిర్మించారు. ఈ సెట్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకి “అసామాన్యుడు” అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. డీజే బ్యూటీ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు విలన్ గా నటిస్తున్నారు. యువ హీరో నవీన్ చంద్ర కూడా కీలకరోల్ పోషిస్తున్నట్టు టాక్. తొలిసారి ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus