‘గో బ్యాక్‌ మోదీ’.. హీరోయిన్ ట్వీట్ వైరల్!

  • February 15, 2021 / 06:22 PM IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీను ఉద్దేశిస్తూ ప్రముఖ నటి ఓవియా సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ పార్టీ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వెంటనే ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలంటూ తమిళనాడు బీజీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర బీజేపీ చీఫ్ డీ అలెక్స్ సుధాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రధాని మోదీ ఆదివారం నాడు తమిళనాడు రాష్ట్రలో పర్యటించారు.

ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. కోట్లను వెచ్చిస్తూ.. చెన్నై వాషర్‌మెన్‌ పేట–విమ్కోనగర్‌ మధ్య మెట్రో రైలు, అలానే విల్లుపురం–తంజావూరు – తిరువారూర్‌ మార్గంలో రైలు సేవలకు పర్మిషన్లు ఇచ్చారు. చెన్నై నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మోదీ తన ప్రసంగంతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మోదీ రాకను నిరసిస్తూ నటి ఓవియా సోషల్ మీడియాలో ‘గో బ్యాక్ మోదీ’ అనే హ్యాష్ ట్యాగ్ తో పోస్ట్ పెట్టారు.

ఇలా పెట్టిన కొన్ని గంటల్లోనే ఆ పోస్ట్ వైరల్ అయింది. ఈ ట్వీట్ చూసిన మోదీ ఫ్యాన్స్, బీజీపీ నేతలు మండిపడుతున్నారు. ఇలా ట్వీట్ చేయడానికి ఎంత తీసుకున్నావ్ అంటూ ఓవియాను ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. దేశద్రోహం కింద ఆమెపై చర్యలు తీసుకొని అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ సీజన్ 1లో కంటెస్టెంట్ గా పాల్గొని పాపులారిటీ దక్కించుకుంది ఓవియా. ఆ షో తర్వాత అమ్మడుకి సెలబ్రిటీ స్టేటస్ వచ్చేసింది. వరుస చిత్రాల్లో నటిస్తూ బాగా బిజీ అయిపోయింది.


Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus