EVV Satyanarayana’: ఆ దెబ్బకి ఈవీవీ సినిమాలు చేయడం మానేశా!

  • May 1, 2021 / 04:40 PM IST

టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసి నటి జ్యోతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పుడప్పుడు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో పాటు కొన్ని బోల్డ్ రోల్స్ లో కూడా నటించింది. తాజాగా ఈమె యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తను ఎదుర్కొన్న కొన్ని సంఘటనల గురించి ప్రేక్షకులతో పంచుకుంది. అయితే ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమాలో తను కూడా నటించానని.. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ తన కోసం కవితలు రాశారని చెప్పుకొచ్చింది.

అనంతరం సినిమాల్లో నటించాలంటే తనకు రెమ్యునరేషన్, ఇతర అంశాల కంటే ఆ పాత్రకు సూట్ అవుతానా..? లేదా..? అనేది చాలా ముఖ్యమని చెప్పింది. గతంలో తాను టాలీవుడ్ దర్శకుడు దివంగత ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ‘తొట్టిగ్యాంగ్’, ‘ఎవడి గోల వాడిది’ వంటి సినిమాల్లో నటించానని.. ఆ నమ్మకంతోనే ‘కితకితలు’ సినిమాలో నటించడానికి అంగీకరించానని తెలిపింది. అయితే లొకేషన్ కు వెళ్లేవరకు తన పాత్ర ఎలా ఉంటుందనే విషయాన్ని చెప్పలేదని గుర్తుచేసుకుంది.

లొకేషన్ కు వెళ్లగానే.. దర్శకుడు వచ్చి పైట విప్పి మంచంపై పడుకోమని నేరుగా తనతో చెప్పడంతో ఒక్కసారిగా షాకయ్యానని వెల్లడించింది. వెంటనే తేరుకొని అలాంటి సన్నివేశంలో నటించనని దర్శకుడి మొహం మీదే చెప్పేసి సినిమా షూటింగ్ స్పాట్ నుండి వెళ్లిపోయానని వెల్లడించింది. ఇక అప్పటినుండి తాను ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన సినిమాల్లో నటించలేదని స్పష్టం చేసింది. అయితే ఈ విషయంలో ఈవీవీ గారిపై తనకు ఎలాంటి కోపం లేదని చెప్పుకొచ్చింది.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus