అబ్బో… సౌందర్య బయోపిక్ కోసం స్టార్ హీరోయిన్ ను పెట్టేశారట…!

  • October 12, 2020 / 04:03 PM IST

మహానటి సావిత్రి గారి తరువాత ఆ స్థాయిలో ప్రేక్షకులకు గుర్తుండిపోయిన నటి సౌందర్య అనే చెప్పాలి. గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా కథా ప్రాధాన్యత కలిగిన సినిమాల్లో నటించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. నిజానికి స్టార్ హీరోయిన్ అయిన తరువాత… చిన్న హీరోలతో సినిమాలు చెయ్యడానికే హీరోయిన్లు ఇష్టపడరు.కానీ సౌందర్య అలా కాదు.. కథలకే ప్రాధాన్యత ఇచ్చింది.మంచి కథ అని తనకు అనిపిస్తే… హీరో గురించి ఈమె పట్టించుకునేది కాదు. బాబు మోహన్, అలీ వంటి కమెడియన్ల సరసన కూడా స్పెషల్ సాంగ్స్ చేసింది. నిజ జీవితంలో సౌందర్య ఎంతో మంది పేద విద్యార్థులను చదివించిందట. అలా ఈమె… కర్ణాటకలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేదని తెలుస్తుంది.

2004 లో ఆమె మరణించినప్పటికీ ఇప్పటికీ ఆమె తల్లిదండ్రులు సౌందర్య పేరు పై సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారని తెలుస్తుంది. మరో పక్క సౌందర్య ఆస్తుల వివాదం విషయం కూడా అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తుంటాయి. సరే ఈ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే.. సౌందర్య బయోపిక్ కు కూడా రంగం సిద్దమయ్యిందనేది తాజా సమాచారం. ఈ బయోపిక్ లో జాతీయ అవార్డు గ్రహీత అయిన కీర్తి సురేష్ నటించబోతున్నట్టు తెలుస్తుంది.సౌందర్య సినీ జీవితం అలాగే ఎవ్వరికీ తెలియని ఆమె చేసిన సేవా కార్య క్రమాల గురించి ఈ బయోపిక్ లో చూపించే అవకాశం ఉందట.

చెప్పాలంటే కీర్తి సురేష్ సారైన చాయిస్ అనే చెప్పాలి.ఇక పై బయోపిక్ లు చెయ్యను అని కీర్తి సురేష్ చెప్పినప్పటికీ.. సౌందర్య బయోపిక్ చెయ్యడం కోసం ఆమె ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు మొన్నటి వరకూ వార్తలు వచ్చాయి. ఒకవేళ ఈమె కనుక ఒప్పుకోకపోతే నిత్యా మీనన్ ను ఎంచుకునే అవకాశం కూడా ఉందని టాక్ వచ్చింది.అయితే ఇప్పుడు సాయి పల్లవిని ఫిక్స్ చేసినట్టు సమాచారం.మళయాళం లోని ఓ బడా నిర్మాణ సంస్థ సౌందర్య బయోపిక్ ను నిర్మించాలని ప్లాన్ చేస్తుందట. ఈ మధ్యనే రెండు,మూడు హిట్టు సినిమాలు తీసిన ఓ యంగ్ డైరెక్టర్ ఈ బయోపిక్ ను తెరకెక్కించే అవకాశం ఉందని సమాచారం.

Most Recommended Video

చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus