Rajinikanth: దీపావళికి రగడ తప్పేలా లేదు!

  • July 17, 2021 / 02:41 PM IST

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రెండు పెద్ద సినిమాలు ఒకేసారి విడుదలైతే కలెక్షన్స్ ను పంచుకోవాల్సి వస్తుంది. కరోనా కారణంగా ప్రేక్షకులు ఎంతవరకు థియేటర్లకు వచ్చి సినిమాలు చూస్తారో చెప్పలేని పరిస్థితి. అందుకే దర్శకనిర్మాతలు మంచి రోజు విడుదల చేద్దామని తమ సినిమాలను పక్కన పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఇద్దరు స్టార్ హీరోలు మాత్రం ఒకేరోజు తమ సినిమాలను విడుదల చేయాలని అనుకుంటున్నారు. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, అజిత్ బాక్సాఫీస్ వద్ద పోటీకి రెడీ అవుతున్నారని సమాచారం.

కోలీవుడ్ లో దీపావళి, సంక్రాంతి రెండూ పెద్ద సీజన్లే. ఆ సమయానికి సినిమాలను విడుదల చేయడానికి పోటీ పడుతుంటారు. గతంలో అలా రెండు, రెండు సినిమాలు విడుదలైన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అలానే పోటీ పడాలనుకుంటున్నారు. ఇటీవల రజినీకాంత్ నటించిన ‘అన్నాత్తే’ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదల చేయాలనుకున్నారు. ఇప్పుడు అజిత్ ‘వాలిమై’ సినిమాను కూడా అదే రోజున రిలీజ్ చేయాలని భావిస్తున్నారట.

కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు సినిమాలను ఒకేరోజు విడుదల చేయడం ఎంతవరకు కరెక్ట్..?. ‘వాలిమై’ నిర్మాత బోనీకపూర్ మాత్రం తన సినిమాను దీపావళికే రిలీజ్ చేస్తానని డిస్ట్రిబ్యూటర్లకు చెబుతున్నారట.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus