సోషల్ మీడియాలో తమ విషయాలను షేర్ చేస్తున్న హీరోల భార్యలు

  • July 3, 2017 / 10:26 AM IST

ఇది వరకు పేపర్లో, టీవీలో ఇంటర్వ్యూలో చెబితేనే సినీ స్టార్స్ గురించి అందరికీ తెలిసేది. ఇప్పుడు సోషల్  మీడియా వేదికపై అభిమానులకు హీరోలు టచ్ లో ఉంటున్నారు. హీరోలు మాత్రమే కాదు వారి భార్యలు కూడా సోషల్ మీడియాలో చురుకుగా ఉంటున్నారు. తమ కుటుంబ విషయాలను ఫ్యాన్స్ కోసం షేర్ చేసుకుంటున్నారు. అటువంటివారిలో ముందు వరుసలో ఉన్న పేరు నమ్రతా శిరోద్కర్. ఈమె తన భర్త మహేష్, పిల్లలు గౌతమ్, సితారతో కలిసి విదేశాలకు టూర్ వెళ్లిన ఫోటోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంటారు. అంతేకాదు సితార చేసే పనులను కూడా వీడియో తీసి అందరితో పంచుకుంటుంటారు. అలాగే తమ పిల్లల గురించి రేణూదేశాయ్ అప్డేట్ ఇస్తుంటారు.

పవన్ కళ్యాణ్ తో విడిపోయినప్పటికీ పవన్ అభిమానులు ఈమెను సొంతమనిషిలా గౌరవిస్తుంటారు. ఫేస్ బుక్ లో రామ్ చరణ్ అప్పుడప్పుడూ తొంగిచూస్తుంటారు. అయితే అతని భార్య ఉపాసన ఇంస్టాగ్రామ్ లో యాక్టివ్ గా అంటారు. చెర్రీతో సరదాగా గడిపిన క్షణాలను పోస్ట్ చేస్తుంటారు. తాజాగా ఈ జాబితాలోకి అజయ్ భార్య శ్వేత వచ్చి చేరారు. కొంతకాలంగా తన వర్కవుట్ ఫోటోలు – ఫోటోషూట్లు పెట్టి చాలామందికి ఫిట్నెస్ గోల్స్ ఇస్తూ ఉంది. ఈ మధ్యనే ఈమె మిసెస్ ఇండియా ఫైనల్ రౌండ్ వరకు వెళ్లడంతో స్టార్ హోదా సొంతం చేసుకుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus