స్టార్ ప్రొడ్యూసర్ ప్లానింగ్ మాములుగా లేదు!

  • November 17, 2021 / 08:54 PM IST

బాలీవుడ్ లో యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సంచలనాలు సృష్టించిన ఈ సంస్థను ఇప్పుడు మరో లెవెల్ కి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. వాటిలో ‘వైఆర్ఎఫ్’ ఓటీటీ ఒకటి. కరోనా వచ్చిన తరువాత థియేటర్లు మూతపడ్డాయి. దీంతో ఓటీటీ హవా పెరిగింది. అందుకే తెలుగులో అల్లు అరవింద్ లాంటి నిర్మాత కూడా సొంతగా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ను మొదలుపెట్టారు.

ఇప్పుడు ఆదిత్య చోప్రా కూడా అదే ప్లాన్ లో ఉన్నారు. తన ఓటీటీను ఐదు వందల కోట్ల పెట్టుబడితో మొదలుపెడుతున్నారాయన. మొదటి ప్రాజెక్ట్ ను చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ప్రయత్నాల్లో ఉన్నారు. దానికోసం ఓ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీను ఎంచుకున్నారు. దీనికి గోపీ పుత్రన్ దర్శకుడిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ సిరీస్ కోసం వంద కోట్లు పెడుతున్నారట. భోపాల్ నేపథ్యంలో సాగే ఈ కథలో నలుగురు పేరున్న బాలీవుడ్ హీరోలు నటిస్తారట.

వారిలో కచ్చితంగా ఒక స్టార్ హీరో ఉంటారని సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం.. అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్లను రంగంలోకి దించాలని ప్లాన్ చేస్తున్నారట. అలానే ఈ తరం యంగ్ హీరోలను తీసుకోవాలనుకుంటున్నారు. ఆదిత్య చోప్రా భార్య రాణి ముఖర్జీ కూడా ఈ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇస్తుందని టాక్. డిసెంబర్ లో ఈ ప్రాజెక్ట్ ను మొదలుపెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన రానుంది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus