సాయి తేజ్ ‘రిపబ్లిక్’.. ఆ నిర్మాతలకు కూడా పెద్ద పరీక్షే..!

  • February 5, 2021 / 10:51 PM IST

సినిమా హిట్ అవ్వడం.. ప్లాప్ అవ్వడం…అనేది పూర్తిగా నిర్మాత పైన ఆదారపడి ఉండదు. కానీ అదేంటో ఈ నిర్మాతలు ఎంత ప్యాషన్ తో.. కోట్లు కుమ్మరించి సినిమాలు రూపొందించినా..అవి డిజాస్టర్లే అయ్యాయి. ఇంతకీ ఎవరా నిర్మాతలు అనుకుంటున్నారా…? ‘శ్రీ బాలాజీ సినీ మీడియా’ అధినేతలు అయిన జె.భగవాన్,జె.పుల్లా రావు లు..! వీళ్ళు గతంలో బాలకృష్ణతో ‘సీమ సింహం’, గోపీచంద్ తో ‘శంఖం’ ‘గౌతమ్ నంద’, ప్రభాస్ తో ‘రెబల్’ వంటి సినిమాలు నిర్మించారు.

ఇవన్నీ పెద్ద సినిమాలే… పైగా స్టార్ హీరోలతో చేసిన సినిమాలే..! అంతేకాదు మినిమమ్ గ్యారెంటీ అనుకున్న దర్శకులు తెరకెక్కించినవే..! అయినప్పటికీ అన్నీ ప్లాపులుగా మిగిలాయి.వీటికి థియేట్రికల్ పరంగా కనీసం 60శాతం కూడా రికవరీ అవ్వలేదు.వింటుంటే నిజంగానే పాపం అనిపిస్తుంది కదూ..! అయినప్పటికీ.. ఇప్పటికీ అదే ప్యాషన్ తో సినిమాలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం తేజుని హీరోగా పెట్టి.. దేవకట్టా డైరెక్షన్లో ‘రిపబ్లిక్’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పూర్తిగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రమిది.

రమ్యకృష్ణ, జగపతి బాబు వంటి స్టార్ క్యాస్టింగ్ ను కూడా ఎంపిక చేసుకున్నారు. వాళ్ళు కూడా పెద్ద మొత్తం పారితోషికం వసూల్ చేసే ఆర్టిస్ట్ లే..! సినిమాకి కూడా భారీ బడ్జెట్ అవుతుందట. తేజు కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందనుందని టాక్.మెగాస్టార్ చిరంజీవే కథ నచ్చి.. ఈ చిత్రం చెయ్యమని తేజుని ఒప్పించారట. మరి మెగా సపోర్ట్ తో అయినా ‘రిపబ్లిక్’ హిట్ అయ్యి ఈ నిర్మాతలకు బ్రేక్ ఇస్తుందేమో చూడాలి..!

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus