బిగ్‌బాస్‌ అన్‌సీన్‌: ఆమె జనాల్ని పార్టిసిపెంట్‌లుగా మారుస్తోందా?

  • October 3, 2020 / 05:31 PM IST

బిగ్‌బాస్‌ అంటేనే… అదొక మాయా లోకం. ఈ రోజు స్నేహితుల్లా ఉన్న పార్టిసిపెంట్స్‌ రేపటికి శత్రువులు అయిపోతారు. ఈ రోజు మాటలతో కత్తులు దూసుకున్నవాళ్లు రేపటికి ప్రేమలు పంచుకుంటున్నారు. నాలుగు వారాల నాలుగో సీజన్‌ ప్రయాణంలో చాలా రకాల ఎమోషన్లు బయటపడ్డాయి. అనుకోని సంఘటనలూ జరిగాయి. అనుకునే అంశాలు కొత్తగా మారాయి. మరి ఈ నాలుగు వారాల గురించి ఇంట్లో ఉన్న మనిషి ఏమనుకుంటున్నారో తెలిస్తే బాగుంటుంది కదా. అందుకే సుజాత మనసులో ఏముందో చూద్దాం.

మనసులో ఏం బాధగా ఉందేమో సుజాత ఓ మూలకు కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటోంది. ఇంతలో ఓ కెమెరా ఆమె వైపు తిరిగింది. దీంతో సుజాత కెమెరాను చూస్తూ ‘కన్నీళ్లు పెట్టుకుంటే చాలు సర్రున ఇటు తిరిగిపోతావేం’ అంటూ మాట్లాడింది. దీనిని చూసిన కుమార్‌ సాయి ‘ఇలాంటి ఆటలు నాకు నచ్చవు. కెమెరాలతో మాట్లాడేసి, జనాలను పార్టిసిపెంట్లు చేయకూడదు’ అంటూ కౌంటర్‌ వేశాడు. జనాలను ఇలా కంటెస్టెంట్లలా చేయడం బాగోదు అంటూ తన అభిప్రాయం చెప్పాడు. తనను నామినేట్‌ చేసిందని కుమార్‌ అలా అన్నాడా? లేక అనిపించి అన్నాడో మరి.

ఇక ఈ నాలుగు వారాల్లో ఇంట్లో పరిస్థితుల గురించి సుజాత కెమెరాతో చెప్పింది. తొలి వారంలో ‘నాది నాది’ అంటూ అందరూ అలముకున్నారు. రెండో వారానికి వచ్చేసరికి ఎలిమినేషన్‌ అయిపోయాక కిచెన్‌ దగ్గర మాటామాట పెరిగింది. మూడోవారానికి వచ్చేసరికి అందరూ హత్తుకున్నారు. నాలుగో వారంలో ‘నువ్వు నాతో జీవితంలో మాట్లాడకు.. నీ ముఖం చూపించకు’ అంటూ కోపాలు వచ్చేశాయి. ముక్కు, చేతులు, మోకాలు పగిలాయి.. పరిస్థితి ఇలా మారింది. మరి వచ్చేవారానికి ఎలా ఉంటుందో? అంటూ నవ్వుకుంది సుజాత. నిజమే వచ్చే వారం ఎలా ఉంటుందో మరి.

Click Here To Watch

Most Recommended Video

బిగ్‌బాస్‌లో రోజూ వినే గొంతు… ఈయనదే!
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!
కోలీవుడ్లో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus